కర్నూలు(జిల్లా పరిషత్): నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంపై హైకోర్టును ఆశ్రయిస్తామని కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, మణిగాంధి అన్నారు. అధికార పార్టీ ఆదేశాల మేరకు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసిన పోలీసులు ఇబ్బంది పడక తప్పదన్నారు. మంగళవారం స్థానిక భాగ్యనగర్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
అధికార పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి అక్రమంగా భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడమే గాకుండా రౌడీషీటు బనాయించారన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ప్రజాసమస్యలు లేవనెత్తే సమయంలో వాగ్వాదపడటం సాధారణమని భూమా నాగిరెడ్డి కౌన్సిల్ హాలులోకి ఆయుధాలు తీసుకెళ్లలేదని, ఎవరినీ చంపే ప్రయత్నమూ చేయలేదని, అలాంటి వ్యక్తిపై ఇన్ని కేసులు ఎలా బనాయిస్తారని ప్రశ్నించారు.
రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై ఇన్ని కేసులు బనాయించడం ఇదే మొదటిసారన్నారు. బయట ఎక్కడో జరిగిన సంఘటనకు కూడా భూమాను బాధ్యున్ని చేశారన్నారు. మూడుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఆయనపై ఎలాంటి కేసులు కూడా లేవన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే భూ మాను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శిం ్డచారు.
రైతురుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణమాఫీ, పింఛన్లు, రేషన్కార్డుల్లో కోత, నిరుద్యోగులకు భృతి, ఇంటింటికి ఓ ఉద్యోగం వంటి హామీలను నెరవేర్చలేక, వాటిపై ఆందోళన చేస్తారన్న భయంతో అక్రమ అరెస్టులకు సిద్ధపడుతున్నారని విమర్శించారు. అధికార పార్టీల నాయకులు చెప్పినట్లు వ్యవహరిస్తే ప్రజల్లో పోలీసులపై నమ్మకం పోతుందని, తద్వారా సమాజంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందన్నారు.
వైఎస్ఆర్సీపీ నాయకుడు కొత్తకోట ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సింగపూర్, టోక్యో చేస్తానని ప్రకటించే చంద్రబాబు బ్రిటిష్ పాలనను తలపిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో యథేచ్ఛగా అక్రమ ఇసుక, మైనింగ్, కల్తీ మద్యం రవాణా జరుగుతున్నా పోలీసులు వాటిపై చర్య లు తీసుకోవడం లేదన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు తోట వెంకటకృష్ణారెడ్డి, నరసింహులు యాదవ్ పాల్గొన్నారు.
భూమా అరెస్టుపై హైకోర్టును ఆశ్రయిస్తాం
Published Wed, Nov 5 2014 3:31 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
సిమ్రాన్, అవినాష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
T20 World Cup 2024 IND VS PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్
ఆర్ఆర్ఆర్ చాలా నచ్చింది.. ఆ హీరోతో పని చేయాలనుంది: హాలీవుడ్ డైరెక్టర్
కేంద్ర కేబినెట్లోకి నడ్డా
చరిత్ర సృష్టించిన సిలికానాంధ్ర స్నాతకోత్సవం..ఏకంగా 16 మంది..
కాంచన-4లో టాలీవుడ్ హీరోయిన్.. రాఘవ లారెన్స్ క్లారిటీ!
బాబర్.. విరాట్ కాలిగోటికి కూడా సమానం కాడు: పాక్ మాజీ ప్లేయర్
తప్పక చదవండి
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement