రుణ మాఫీ అంటూ మోసం చేశారు
ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానంటూ చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ మాటెత్తకుండా తమను మోసం చేశారని జగన్ ఎదుట మహిళలు వాపోయారు. ప్రజాసంకల్ప యాత్ర కందుకూరుకు చేరుకోగానే జననేతను గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు లక్ష్మీదేవి, రామలక్ష్మీ, ప్రవళ్లిక, కాటమమ్మ, తులసి, రంగరత్న, ఓబుళమ్మ, సుశీల, అరుణ, లక్ష్మి,, నాగవేణి, సంధ్య కలిసి.. తాము ఎలా మోసపోయింది వివరించారు. బ్యాంకర్ల ఒత్తిళ్లు తట్టుకోలేక అధిక వడ్డీకి ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పు చేసి బ్యాంక్లకు కట్టాల్సి వచ్చిందన్నారు.