పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలి | Sakshi
Sakshi News home page

పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలి

Published Sat, Dec 8 2018 7:53 AM

Farmers meet YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం అర్బన్‌: ఎచ్చెర్ల మండలం, జి.సిగడాం, సేతుభీమవరం గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 600 ఎకరాల విస్తీర్ణం గల భూమి వారసత్వంగా వస్తోందని, దీనికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలని సేతుభీమవరం గ్రామానికి చెందిన పైల త్రినాథరావు ప్రతిపక్షనేత జగన్‌ను కలసి విన్నవించారు. గతంలో ఇనాం ఉండేదని, ప్రభుత్వం ఇనాంను రద్దు చేస్తూ రైతులకు భూమిపై హక్కులు ఇచ్చినపుడు తామంతా భూమిపట్టాలకు అర్హులమన్నారు. ఈ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చేలా చూడాలని కోరారు.

Advertisement
Advertisement