వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఎక్కడికైనా కలిసే వెళ్తుండే వారు.. ఈ క్రమంలో తోట వద్దకు మోటార్సైకిల్పై బయలుదేరారు.. ఇదే చివరి ప్రయాణమవుతుందని పాపం వారు ఊహించి కూడా ఉండరు.. మార్గమధ్యంలో మృత్యువు లాంటి లారీ కబళించింది.. మరణంలోనూ వారి బంధం వీడలేదు.. కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.
చక్రాయపేట : మండలంలోని వేంపల్లె - రాయచోటి రహదారి వద్ద తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి నుంచి ఎర్రగుంట్లకు వెళ్తున్న లారీ (నంబర్: కేఏ05పి 1745), ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్సైకిల్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. చక్రాయపేట గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మాపురంపేటకు చెందిన కొండయ్య కుమారుడు ఓబులేసు(27), కుప్పం గ్రామం వడ్డేపల్లెకు చెందిన నారాయణ కుమారుడు శంకరయ్య(32) చదువు ముగిసినప్పటి నుంచి స్నేహితులుగా కలిసిమెలిసి తిరిగారు. వారి తల్లిదండ్రులు 20 ఏళ్ల నుంచి స్నేహంగా ఉండటంతో.. వీరు కుటుంబ స్నేహితులుగా మెలిగారు. ఓబులేసు వేంపల్లెలో నెట్ సెంటర్ నిర్వహిస్తుండగా, శంకరయ్య రైతుగా ఉంటూ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించారు.
తోట వద్దకు వెళ్తుండగా:
ఈ క్రమంలో వారు వేంపల్లె సమీపంలోని శంకరయ్య తోట వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వేంపల్లె నుంచి ఓబులేసు, వడ్డేపల్లె నుంచి శంకరయ్య బయలుదేరి మార్గమధ్యంలో కలుసుకుని, వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి పోలీసులు వెంటనే చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం చేయించడానికి వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని బోరున విలపించారు.
కొండయ్యకు ఓబులేసుతోపాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఉన్న ఒక్క కుమారుడు చనిపోవడంతో వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. ఓబులేసుకు భార్య రాధిక, 6 నెలల కుమారుడు ఉన్నారు. రాధిక తన చంటిబిడ్డను తీసుకుని భర్త మృతదేహంపై పడి విలపించడం అక్కడి వారి హృదయాలను కలిచి వేసింది. లారీ డ్రైవర్ చంద్రశేఖరరెడ్డిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోవిందరెడ్డి తెలిపారు.
మృత్యువులోనూ వీడని బంధం
Published Mon, Sep 14 2015 3:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement