సాక్షి, అనంతపురం :
అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ సమీపంలో కొత్తగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్కు కొంత మంది యువకులు వెళ్లారు.. బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు.. దాన్ని తినే సమయంలో ఏదో తేడా కన్పించింది.. దీంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అది గొడవకు దారి తీసింది.. స్థానికంగా ఉన్నకొంత మంది వ్యాపారులు జోక్యం చేసుకుని సర్ది చెప్పి పంపించారు.
టవర్క్లాక్ సమీపంలోనే మరో రెస్టారెంట్లో బిర్యానీలో కట్ నూడుల్స్ కలిపినట్లు గుర్తించి వినియోగదారులు నిలదీశారు. దీంతో గొడవ మొదలైంది. సమస్యను ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించడంతో నిర్వాహకులు దిగొచ్చారు. సమస్య పెద్దది కాకుండా చూశారు.
‘సర్. బిర్యానీ వేడివేడిగా ఉంది. చల్లారకముందే తినేయండి’ అంటూ ఇటీవల నగరంలో ఏ రెస్టారెంట్/హోటల్కు వెళ్లినా వెయిటర్లు తొందర పెడుతున్నారు. అది చల్లారితే కట్ నూడుల్స్ బాగోతం బయటపడుతుందన్నది వారి భయం. ఇందుకుతగ్గట్టే ఏసీ కూడా తక్కువగా పెడుతున్నారు. సాధారణంగా బిర్యానీ తయారీకి బాస్మతి బియ్యం వాడతారు. ఇవి రుచికరంగా ఉంటాయి. అయితే.. మార్కెట్లో వీటి ధర ఎక్కువగా ఉంటోంది. కిలో రూ.110 పైమాటే. దీంతో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు ఖర్చు కొంత తగ్గించుకునేందుకు లావురకం చైనీస్ నూడుల్స్ కలుపుతున్నారు. వీటిని బాస్మతి బియ్యం పరిమాణంలోనే కత్తిరించి బిర్యానీలో వేస్తున్నారు. దీనివల్ల వినియోగదారులు తేడాను వెంటనే కనిపెట్టలేకపోతున్నారు. నూడుల్స్ ధర కిలో రూ.60లోపే ఉంటోంది. వీటిని బిర్యానీ వండే సమయంలో కలపరు. వినియోగదారుడు ఆర్డర్ ఇచ్చినప్పుడు డిష్లో కలిపి తీసుకొస్తున్నారు. రంగు, మసాల దట్టించి ఉండడంతో తేడాను గుర్తించడం కష్టమవుతోంది.
మాంసాహారులకే కాదు.. వెజ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్రైస్ తినేవారికీ ఈ బెడద తప్పడం లేదు. బార్ అండ్ రెస్టారెంట్లు, దాబాలకు చాలా మంది మద్యం తాగేందుకు వెళుతుంటారు. మద్యం తీసుకున్నాక చివర్లో బిర్యానీ ఆర్డర్ చేస్తుంటారు. మద్యం మత్తులో ఉండే వారికి ఏమిచ్చినా తింటారనే భావన నిర్వాహకుల్లో ఉంది. దీంతో బిర్యానీని యథేచ్ఛగా కల్తీ చేస్తున్నారు.
నిద్దరోతున్న ప్రజారోగ్య శాఖ .. ఆహార పదార్థాల కల్తీని నివారించాల్సిన ప్రజారోగ్య శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలున్నాయి. జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల నుంచి క్రమం తప్పకుండా మామూళ్లు ముడుతుండడంతో తనిఖీలు నిర్వహించడం లేదన్న అపవాదు ఉంది. ఫలితంగా వాటి నిర్వాహకులు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
చూసి తినండి!
Published Thu, Oct 2 2014 1:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement