సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంశంపై మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయం కాంగ్రెస్లోని ఇరు ప్రాంతాల నేతల్లోనూ గందరగోళం సృష్టిస్తోంది. కొందరు ఈ అఖిలపక్షాన్ని ఆహ్వానిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. విభజన విధివిధానాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ఈ భేటీ నిర్వహిస్తుం డటంపైనా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. ఈ భేటీ నిర్ణయం వెనుక వేరే ఏదైనా మతలబు ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
పీసీసీ తరఫున ఈ భేటీకి ఎవరు హాజరు కావాలి? గతంలో మాదిరి ఇరు ప్రాంతాలనుంచి ఒక్కొక్కరు చొప్పున ఇద్దర్నీ పంపిస్తారా? ఒకవేళ అలా పంపాలని నిర్ణయిస్తే సీమాంధ్ర ప్రతినిధిగా హాజరయ్యే నాయకుడికి ప్యాకేజీ కోరడం మినహా మరో అవకాశం ఉండదు. అలాంటప్పుడు అఖిలపక్ష సమావేశానికి హాజరై ప్రయోజనమేంటి? వంటి అనేకాంశాలు నేతల్లో చర్చనీయాంశమయ్యాయి. అఖిలపక్ష భేటీకి సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇద్దరూ కలసి చర్చించి రెండు పేర్లను పంపిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
గతంలో అఖిలపక్షాన్ని నిర్వహించిన సందర్భాల్లో పార్టీలనుంచి ఇద్దరేసి ప్రతినిధులకు అవకాశమిచ్చారు. ఈసారి ఎందరిని పిలుస్తారన్న దానిపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. చిదంబరం హోంమంత్రిగా నిర్వహించిన సమావేశాలకు సీమాంధ్ర నుంచి కావూరి సాంబశివరావు, తెలంగాణ నుంచి ఉత్తమ్కుమార్రెడ్డి హాజరయ్యారు. షిండే హోంమంత్రి అయ్యాక నిర్వహించిన అఖిలపక్ష భేటీకి సీమాంధ్ర నుంచి గాదె వెంకటరెడ్డి, తెలంగాణ నుంచి కేఆర్ సురేష్రెడ్డి వెళ్లారు. ఈసారీ అదేవిధంగా ఇద్దరికి అవకాశమిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఈసారి ఒకే ప్రతినిధిని ఆహ్వానిస్తే పీసీసీ అధ్యక్షుడే హాజరయ్యే అవకాశాలున్నాయంటున్నారు.
విభజన నిర్ణయం నేపథ్యంలో సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే అఖిల పక్ష సమావేశమైనందున ప్యాకేజీ కోరడమొక్కటే తమ ముందున్న అంశమని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు. ఇప్పటివరకు సమైక్య ప్రకటనలు చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఈ అఖిలపక్ష నిర్ణయంపై తలోరకంగా స్పందిస్తున్నారు. దీనికి తాము వెళ్లబోమని, పార్టీ ఎవరిని పంపిస్తుందో తమకు తెలియదని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కన్వీనర్, మంత్రి సాకే శైలజానాథ్ మీడియాకు చెప్పారు. విభజనపైనే ఈ అఖిలపక్షమైతే తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
అఖిలపక్షంపై కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు
Published Thu, Oct 31 2013 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
Advertisement