-
యథా సీఎం..తథా కళావతి
పాలకొండ రూరల్: సిద్ధం, మేమంతా సిద్ధం సభలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ఎలా మమేకమై..ఎంత ఆప్యాయంగా కలిసిపోతున్నారో రాష్ట్రప్రజలందరికీ విదితమే. యథా రా జా తథా ప్రజా అన్నట్లు తమ నాయకుడి బాటలోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమైపోతున్నారు. వారి కష్టాలను విని చలించిపోతున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న వైఎస్సార్సీపీ పాలకొండ నియోజకవర్గం అభ్యర్థి విశ్వాసరాయి కళావతికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఆమె పాలకొండ మండలంలోని తంపటాపల్లి గ్రామంలో ప్రచారం చేస్తున్న క్రమంలో వృద్ధురాలు పడాల కామమ్మ కళావతి చేతిలో ఉన్న జగనన్న చిత్రపటాన్ని చూసి దగ్గరకు వచ్చింది. తనకు జగన్ బాబు మనుమడని, ఆయన వల్లనే పింఛన్ వస్తోందంటూ సంతోషం వెలిబుచ్చింది. వలంటీర్లు లేకపోవడంతో రెండు నెలులుగా పింఛన్ కోసం తాను పడుతున్న ఇబ్బందులను వివరించింది. దీంతో చలించిపోయిన కళావతి సదరు వృద్ధురాలిని ఆలింగనం చేసుకున్నారు. ప్రతిపక్షాల కుట్రే ఈ పరిస్థితికి కారణమని, మీరంతా జగనన్నను, తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని, సంక్షేమం మీ గడప వద్దకే వలంటీర్ల ద్వారా అందిస్తామని చెప్పారు. ప్రజల సమక్షంలో కామమ్మను సన్మానించి, పాధాభివందనం చేశారు. అనుకోని ఈ ఘటనతో కళావతి సున్నిత మనస్తత్వానికి చప్పట్లతో స్థానికులు హర్షం తెలిపారు. జై జగన్ నినాదంతో ప్రజలు ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. -
నూతన విద్యా విధానంతోనే యువతకు భవిష్యత్తు
● విశ్వవిద్యాలయంలో జాతీయ విద్యా విధానంపై సదస్సు విజయనగరం అర్బన్: దేశ యువత బంగారు భవిష్యత్తు కోసం నూతన విద్యా విధానం అమలు కొనసాగాలని భారతీయ శిక్షన్ మండల్ జాతీయ కార్యదర్శి బీఆర్ శంకరానంద అన్నారు. స్థానిక గిరిజన యూనివర్సిటీలో జాతీయ విద్యావిధానం–2020 పై శుక్రవారం జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యావిధానం విద్యార్థిలో ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడం లేదని, లక్ష్యం సాధించకపోతే ఆత్మహత్యకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు. ట్రైబల్ స్టడీస్ విభాగాధిపతి డాక్టర్ అనిరుద్కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించిన కార్యక్రమంలో డీన్ ఆచార్య జితేంద్రమోహన్ మిశ్రా, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన తైక్వాండో జాతీయ సెమినార్
విజయనగరం: న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన నేషనల్ రెఫరీ సెమినార్కు మంచి స్పందన లభించింది. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులు అంతర్జాతీయ క్లాస్–1 రిఫరీ తిరుమల్ జయపాల్ నేతృత్వంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి చివరి రోజు స ర్టిఫికెట్లు ప్రధానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో న్యూ ఆంధ్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు అచ్యుతరెడ్డి, జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు గురాన అయ్య లు, కార్యదర్శి శ్రీహరి, వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చెంనాయుడు, ఉపాధ్యక్షుడు నయబ్ రసూల్, ప్రతినిధులు శ్రీనివాసులు, సాయిబాబా పాల్గొన్నారు. -
చంద్రబాబు పాపం.. పింఛన్దారులకు శాపం
చంద్రబాబు నాయుడు హయాంలో...విజయనగరం అర్బన్: చంద్రబాబు హయాంలో ఐదేళ్ల కిందటి వరకు పింఛన్ మొత్తాన్ని రూ.వెయ్యి చొప్పునే అందించేవారు. అది కూడా అర్హులందరికీ కాక, కొద్దిమందికే అందేది. 2019 జనవరి వరకు ఇదే మొత్తం కొనసాగేది. అప్పట్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా రూ.2 వేలకు పెంచారు. అది కూడా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి ప్రకటించిన తర్వాత! ఈ సొమ్ము కోసం కూడా పంచాయతీ కార్యాలయాల చుట్టూ గంటలు, రోజుల తరబడి లబ్ధిదారులు పడిగాపులు కాయాల్సి వచ్చేది. వేకువజామున 6 గంటల నుంచే చెట్లు, గట్టుల వద్ద పాట్లు పడేవారు. మండుటెండలో నిరీక్షించేవారు. పండుటాకుల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి రాగానే సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి నేరుగా ఇళ్ల వద్దకే పింఛను అందించారు. దీనివల్ల వేలాది మంది వృద్ధులు, దివ్యాంగులు, మానసిక వికలాంగులకు ప్రయోజనం కలిగింది. అంతేకాదు.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని ప్రతి ఏడాదీ పెంచుకుంటూ వెళ్తూ, రూ.3 వేలు చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రతినెలా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటికే తీసుకెళ్లి పింఛన్ మొత్తం అందించడం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదు. కరోనా వంటి కష్ట సమయమైనా, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఠంచన్గా పింఛన్ అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదే. అన్నగా ఇచ్చిన ఆ మొత్తంతోనే ఎంతోమంది నిర్భాగ్య మహిళలు తమ ఇంటి అవసరాలను తీర్చుకునేవారు. వృద్ధులు నెలకు సరిపడా మందులు కొనుగోలు చేసుకునేవారు. నాలుగున్నరేళ్లు ఇదే విధంగా సాఫీగా సాగింది. మళ్లీ ఆ నాటి రోజులే.. చంద్రబాబు హయాంలో పింఛనుదారులు ఎటు వంటి ఇబ్బందులు పడేవారో.. మళ్లీ ఆ కష్టాలను రెండు నెలలుగా లబ్ధిదారులు చూస్తున్నారు. ఎండల్లో సచివాలయాలు, బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కిలోమీటర్ల దూరం నడిచి బ్యాంకులకు వస్తూ సొమ్మసిల్లిపడిపోతున్నారు. మొన్నటి వరకూ వలంటీర్లే ఇంటికి తెచ్చి, ఒకటో తేదీనే పింఛన్ ఇచ్చేవారని.. చంద్రబాబు చేయించిన ఫిర్యా దుల వల్ల ఈ వయసులో అవస్థలు పడుతున్నామని వృద్ధులు వాపోతున్నారు. చంద్రబాబుకు మాపై ఎందుకింత పగో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఉసురు తప్పకుండా తగులుతుందంటూ శాపనార్థాలు పెడుతున్నారు. డోర్ టు డోర్ పంపిణీ 97.25 శాతం పూర్తి జిల్లాలో మే నెలకు సామాజికి పింఛన్దారులు 2,82,903 మంది. వీరిలో 2,11,393 మందికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమకానుంది. 30 శాతం మంది బ్యాంకు ఖాతాలు ఇన్యాక్టివ్గా ఉన్నట్టు సమాచారం. బ్యాంకుల వద్ద పడిగాపులు కాసినా బ్యాంకర్లు చెబితేగాని లబ్ధిదారులకు తెలియని పరిస్థితి. డోర్ టు డోర్ పంపిణీ చేయాల్సిన 68,944 మందిలో ఇంతవరకు 97.25 శాతంతో 67,047 మందికి పంపిణీ చేశారు. దాదాపు అన్ని మండలాలలోనూ 95 శాతం దాటి పంపిణీ జరిగింది. జగన్మోహన్రెడ్డి పాలనలో.. ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్దారుల ఇంటి ముంగిటకు వలంటీరు వచ్చి.. వేలిముద్ర తీసుకుని చేతికి పింఛన్ డబ్బులు అందజేసేవారు. కరోనా వంటి కష్ట కాలంలోనూ పింఛన్ పంపిణీ ఆగలేదు. లేవలేని స్థితిలో ఆస్పత్రిలో ఉన్నా సరే... ఆ డబ్బులు మందుల ఖర్చులకై నా పనికొస్తాయని ఊళ్లు దాటి మానవతాదృక్పథంతో రోగుల వద్దకే వెళ్లి వలంటీర్లు పింఛన్లు అందించేవారు. వ్యవసాయ సీజన్ సమయంలో పొలాలకు వెళ్లి పంపిణీ చేసేవారు. 58 నెలలుగా అవ్వాతాతలకు ఎలాంటి కష్టాలు లేవు. నిమ్మగడ్డను దేవుడు క్షమించడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతినెలా వలంటీర్ ఇంటికి వచ్చి మంచపై అనారోగ్యంతో ఉన్న నాకు 1వ తారీఖున పింఛన్ డబ్బులు ఇచ్చేవాడు. చంద్రబాబు సూచనలతో నిమ్మగడ్డ రమేష్కుమార్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి మా లాంటి వృద్ధులకు ఆవేదన మిగిల్చాడు. ఆయనను దేవుడు క్షమించడు. చేసిన పాపం ఊరకనే పోదు. – నల్ల పెంటయ్య, పింఛన్దారు, మరడాం గ్రామం నెలలో రోజులు గడిచినా పింఛన్ చేతికందేది కాదు. ఎప్పడిస్తారో స్పష్టత లేదు. పంచాయతీ కార్యాలయాల వద్ద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి. కార్యదర్శి రాకకోసం ఎదురుచూసే పరిస్థితి. సిగ్నల్స్ లేకపోతే ఆ రోజు పింఛన్ అందేది కాదు. మరోవైపు పింఛన్ డబ్బుల్లో జన్మభూమి కమిటీల చిలక్కొట్టుడు. పింఛన్దారులకు తప్పని కష్టాలు. ఎన్నికల వేళ ఇప్పుడు మళ్లీ పింఛన్దారులపై ‘కూటమి’ అక్కసు. వలంటీర్ల సేవలను దూరం చేసి పింఛన్లు అందకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. నాడు టీడీపీ హయాంలో పంచాయితీ కార్యాలయాల వద్ద పడిగాపులు ఎన్నికల వేళ చంద్రబాబు అండ్ కో ఫిర్యాదుతో మళ్లీ బ్యాంకుల వద్ద నిరీక్షణ ఆవేదనలో అవ్వాతాతలు, వితంతువులు వ్యయప్రయాసలకోర్చి బ్యాంకులకు చేరుకుంటున్న వైనం వలంటీర్ల సేవలను అడ్డుకోవడంపై ఆగ్రహం చంద్రబాబుకు శాపనార్థాలు చంద్రబాబు కుట్రలతోనే ఇదంతా.... ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీనే అవ్వాతాతలకు, అభాగ్యులకు అందించే సామాజిక పింఛన్లపై వలంటీర్లను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ రాజకీయం మొదలు పెట్టింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని... వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తే, ఓటర్లు ప్రభా వితం అవుతారంటూ చంద్రబాబు ప్రోద్బలంతో ఆయన శిష్యుడు నిమ్మగడ్డ రమేష్కుమార్ హైకోర్టును, ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. బ్యాంకుల్లోనే పింఛన్ మొత్తం జమ చేయాలని కోరారు. దీనిపై ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. గత నెలలో సచివాలయాల వద్ద పంపిణీ చేసినా ఎక్కడో తప్పు జరిగిపోతోందంటూ మరలా టీడీపీ అండ్ కో ఫిర్యాదులు చేసింది. నిత్యం ఫిర్యాదులు రావడంతో డీబీటీతో బ్యాంకుల ద్వారా పింఛన్ మొత్తం ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. దీనిపై కూడా ‘ఎల్లో’ బ్యాచ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. -
కొనసాగుతున్న బోట్ల యజమానుల పేర్ల నమోదు
పూసపాటిరేగ : జిల్లాలో మత్స్యకార భరోసా – వేట నిషేధ భృతి పథకానికి సంబంధించి ఈ నెల 2 నుంచి ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో ఉన్న బోట్లుకు సంబంధించిన పేర్లు నమోదు చేస్తున్నట్టు మత్స్య శాఖ డీడీ నిర్మలాకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చింతపల్లి, తిప్పలవలస, పతివాడబర్రిపేట, తమ్మయ్యపాలెం, ముక్కాం, చేపలుకంచేరు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో రెన్యూమరేషన్ జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో ఉన్న బోట్లుకు సంబంధించి పేర్లు నమోదు చేయించుకోవడం, రిజిస్ట్రేషన్ పత్రం, బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, వాలిడ్ ఫిషింగ్ లైసెన్సు తదితర పత్రాలను పరిశీలించి వేట నిషేధ భృతికి ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే పూసపాటిరేగ, భోగాపురం మండలాలులో 3 వేలకు పైబడి మత్స్యకారులు పేర్లు నమోదయ్యాయన్నారు. కొద్ది రోజులులో పూర్తి స్థాయిలో సభ్యుల అర్హతలును బట్టి గుర్తించడం జరుగుతోందన్నారు. మత్స్యశాఖ డీడీ నిర్మలాకుమారి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement