-
తస్మాత్ జాగ్రత్త
ఫ నేరం చేస్తే నేరుగా జైలుకే ఫ పోలీస్ నియమావళి కఠినతరం ఫ ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం కాకినాడ సిటీ: ఎన్నికల వేళ పోలీసులకు విశేషాధికారాలు ఉంటాయి. వారు నిజంగా అనుకుంటే ఎంతటి నేరగాడినైనా ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉంటుంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే లక్ష్యంతో ఏ చిన్న నేరాన్నీ ఉపేక్షించకుండా కట్టడి చేసే అధికార అస్త్రాలు పోలీసుల అమ్ములపొదిలో ఉంటాయి. ఆ అస్త్రాలివీ.. ● సెక్షన్ 125ఎ: అభ్యర్థులు తమకు పడిన శిక్షలు, తమపై మోపిన నేరాలకు సంబంధించిన విచారణల వివరాలను ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచటం నేరం. దీనికి ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ● సెక్షన్ 126: ఎన్నికలకు 48 గంటల లోపు ఊరేగింపులు చేయడం, సమావేశాలు నిర్వహించటం, మీడియా ప్రకటనలు ఇవ్వడం, సంగీత కచేరీలు తదితర వినోద కార్యక్రమాలు నిర్వహించటం నేరం. దీనికి రెండేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధిస్తారు. ● సెక్షన్ 127ఎ: ఘర్షణలు సృష్టించే ఉద్దేశంతో రాజకీయ పార్టీల బహిరంగ సభలకు ఎవరైనా అడ్డంకులు సృష్టించటానికి ప్రయత్నించటం నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆరు నెలల జైలు శిక్ష తప్పదు. ● సెక్షన్ 127: ప్రచురణకర్తల చిరునామా లేకుండా కరపత్రాలు, పోస్టర్లు, ఇతర ప్రకటనలు ముద్రించటం నేరం. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలను జిల్లా మెజిస్ట్రేట్ అనుమతితోనే జారీ చేయాలి. దీనిని ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు, రూ.25 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ● సెక్షన్ 128: ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియకు చెందిన విషయాలను గోప్యంగా ఉంచాలి. దీనిని ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. ● సెక్షన్ 129: ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఏ పార్టీ అభ్యర్థికై నా అనుకూలంగా వ్యవహరించటం నేరం. దీనిని అతిక్రమిస్తే ఆరు నెలల జైలు, జరిమానా తప్పవు. ● సెక్షన్ 130: పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల లోపు ప్రచారం నిర్వహించటం, ఓటర్లను అభ్యర్థించ టం, ఇతర పార్టీల అ భ్యర్థులకు ఓట్లు వేయవద్దని చెప్పడం నేరం. ● సెక్షన్ 131, 132: పోలింగ్ స్టేషన్లలోని వ్యక్తులకు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఆగ్రహం తెప్పించేలా మెగా ఫోన్లు, లౌడ్ స్పీకర్లతో ధ్వనులు చేయడం నిషిద్ధం. అలాంటి వారిని అరెస్టు చేయాల్సిందిగా ప్రిసైడింగ్ అధికారులు, పోలీసు అధికారులకు సూచించవచ్చు. నిందితులకు మూడు నెలల జైలు, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ● సెక్షన్ 134ఎ: ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి పోలింగ్, కౌంటింగ్ ఏజెంటుగా ఉండటం నేరం. అలా చేస్తే మూడు నెలల జైలు తప్పదు. ● సెక్షన్ 134బి: ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారుల అనుమతి పొందిన సాయుధ పోలీసులు మినహా ఎవ్వరూ ఆయుధాలు ధరించి, పోలింగ్ స్టేషన్ సమీపంలో సంచరించకూడదు. పట్టుబడితే రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. ● సెక్షన్ 165, 166 సీఆర్పీసీ: వారెంట్లు లేకుండానే సోదాలు చేసే అధికారాన్ని పోలీసులకు ఈ సెక్షన్లు కల్పిస్తాయి. ఓటర్లకు పంపిణీ చేయటానికి ఎక్కడైనా డబ్బు, మద్యం, ఇతర బహుమతులను భద్రపరచినట్లు సమాచారం వస్తే పోలీసులు వెంటనే సోదాలు నిర్వహిస్తారు. అనుమతి లేకుండా ఉంచిన ఆయా సామగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేస్తారు. ● సెక్షన్ 353, 332, 186, 189, 190: వీటి ప్రకారం ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులను నిరోధించటం, దౌర్జన్యాలకు పాల్పడటం, దాడులు చేయటం వంటి చర్యలను నేరాలుగా పరిగణిస్తారు. ఎన్నికల నేపథ్యంలో కిడ్నాపులు, దాడులు, దౌర్జన్యా లు, హత్యాయత్నాలు, మారణాయుధాలు వినియోగించి దాడులకు పాల్పడటం, బాంబులు విసురుకోవడం చేస్తే ఐపీసీతో పాటు ఆర్పీ యాక్టు, పోలీసు చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. -
ఎండగంట పడకుండా..
పోలింగ్ సమయం గంట పొడిగింపు రాయవరం: ఎన్నికల ప్రచారంలో తలమునకలవు తున్న అభ్యర్థులపై సూరీడు కొద్ది రోజులుగా కన్నెర్ర చేస్తున్నాడు. మార్తాండుడి ప్రతాపానికి తాళలేక చాలా మంది అభ్యర్థులు ఉదయం, సాయంత్రం వేళల్లోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది పోలింగ్పై ప్రభావం చూపుతుందన్న రాజకీయ పార్టీల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఊరటనిచ్చే మాట చెప్పింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పోలింగ్ ఈ నెల 13వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరగాల్సి ఉంది. తాజాగా దీనిని సాయంత్రం 6 గంటల వరకూ పొడిగించారు. సాయంత్రం 5 తర్వాత వేడి కొంత తగ్గుతుంది. దీంతో కొంత వెసులుబాటు ఏర్పడి ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. సౌకర్యాల కల్పనకు చర్యలు మండు వేసవిలో ఎన్నికలు జరుగుతుండడంతో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద షామియానాలు, తాగునీరు, కుర్చీలు తదితరాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. పోలింగ్కు ముందు రోజు వచ్చే సిబ్బంది సేద తీరేందుకు కూలర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వృద్ధులు కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు రవాణా సౌకర్యం సైతం కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకు కొంత బడ్జెట్ను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కేటాయించే అవకాశం ఉంది. -
పూలవనం..గోదారి సోయగం..
నియోజకవర్గంలో 2019–23 మధ్య వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధి పథకం లబ్దిదారులు నిధులు (రూ.కోట్లలో) జగనన్న అమ్మ ఒడి 40,753 87.67 జగనన్న విద్యా దీవెన 15,939 52.43 జగనన్న వసతి దీవెన 12,069 19.75 వైఎస్సార్ ఆసరా 28,558 68.66 జగనన్న చేదోడు 3,469 4.71 వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 34,977 18.48 వైఎస్సార్ కాపు నేస్తం 8,955 15.7 వైఎస్సార్ ఈబీసీ నేస్తం 1448 4.05 వైఎస్సార్ చేయూత 26,045 68.67 వైఎస్సార్ పెన్షన్ కానుక 32,364 249.32 వైఎస్సార్ సున్నా వడ్డీ 26,177 10.02 వైఎస్సార్ వాహనమిత్ర 2,824 7.65 వైఎస్సార్ రైతు భరోసా 27,321 51.44 వైఎస్సార్ బీమా 1230 3.35 నాన్ డీబీటీ కార్యక్రమం పనులు/ నిధులు భవనాలు (రూ.కోట్లలో) నాడు–నేడు 86 38.12 రైతుభరోసా కేంద్రాలు 42 10.05 సచివాలయాలు 61 26.592 విలేజ్ క్లినిక్స్ 54 11.234 సీసీరోడ్లు, డ్రైన్లు (గ్రామాల్లో) 593 18.55 వాటర్ ట్యాంకులు 23 5.27 ఇళ్ల స్థలాలు 5,467 జగనన్న ఇళ్లు 5,511 42.82 అంగన్వాడీ భవనాలు 5 0.60 జల్జీవన్ మిషన్ 76 41.23 గడప గడపకూ మన ప్రభుత్వం 273 11.95 ● కాటన్ బ్యారేజీతో సస్యశ్యామలం ● మనసును దోచే నర్సరీలురాజమహేంద్రవరం రూరల్: దాదాపు మూడున్నర లక్షల జనాభా, రెండున్నర లక్షల మందికి పైగా ఓటర్లు, అనేక ప్రత్యేకతలతో రాజకీయ చైతన్యానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం. దేశ, విదేశాల్లో గుర్తింపు పొందిన కడియం నర్సరీలు, డెల్టాకు గోదారమ్మ పరవళ్లను నియంత్రించే ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ, రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉండే ప్రధాన రైల్వే స్టేషన్ ఈ నియోజకవర్గ గుర్తింపును శాశ్వతం చేస్తున్నాయి. ఆధ్యాత్మికంగా ఇస్కాన్, స్వామి అయ్యప్ప, సరస్వతీ, మహాకాళేశ్వర ఆలయాలు కూడా మంచి గుర్తింపు పొందాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బులుసు సాంబమూర్తి స్వగ్రామం దుళ్ల కూడా ఈ నియోజకవర్గంలోని కడియం మండలం పరిధిలోనే ఉంది. నియోజకవర్గ స్వరూపం గతంలో కడియం నియోజకవర్గంగా పిలిచేటప్పుడు దీనిలో కడియం, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం మండలాలతో పాటు రాజమహేంద్రవరం సిటీ శివార్లలోని పలు వార్డులు ఉండేవి. అనంతరం రాజానగరం ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడటంతో రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాలతో పాటు, సిటీలోని 9 వార్డు లు రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి. ఈ నియోజకవర్గంలోని పది గ్రామాలను గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిలో చేర్చారు. విరివనాల సిరులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల కలగలుపుగా ఉండే ఈ నియోజకవర్గంలోని కడియం ప్రాంత పూల వనాలను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. 25 వేల ఎకరాలకు పైగా విస్తరించిన ఇక్కడి నర్సరీల్లో దేశ, విదేశాలకు చెందిన వెయ్యికి పైగా పువ్వులు, పండ్లు, అలంకరణ మొక్కలను రైతులు అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ రెండు వేల మందికి పైగా గుర్తింపు పొందిన నర్సరీ రైతులున్నారు. ఈ నర్సరీలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి పైగా ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ పని చేయడానికి శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి వలస కార్మికులు వస్తూంటారు. అలాగే కడియం, రాజమహేంద్రవరం రూరల్, కొత్తపేట, ఆలమూరు తదితర మండలాలకు చెందిన కార్మికులు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడి నుంచి దేశం నలుమూలలకే కాకుండా, అరబ్ దేశాలకు కూడా మొక్కలను ఎగుమతి చేస్తూంటారు. రెండు రూపాయల నుంచి రూ.20 లక్షలు పైగా విలువ చేసే మొక్కలు ఇక్కడ లభిస్తాయి. వీటిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ నర్సరీలు సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట నిర్మించడంతో మరింతగా విస్తృతమయ్యాయని స్థానిక రైతులు చెబుతారు. ఈ ఆనకట్ట ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణగా మార్చింది. ఇవీ ప్రత్యేకతలు ● గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలోని లక్షల ఎకరాలకు ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ● గోదావరి తీరాన ఇస్కాన్, అయ్యప్పస్వామి, విశ్వేశ్వరస్వామి, సరస్వతి, మహాకాళేశ్వర ఆలయాలు, ధవళేశ్వరం జనార్దనస్వామి ఆలయం ప్రముఖమైనవి. ● పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, డైట్, పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులో ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు చదువుకునేందుకు ఇక్కడకు వస్తారు. ● పునర్విభజన అనంతరం రాజమహేంద్రవరం కేంద్రంగా ఆవిర్భవించిన నూతన తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ ఈ నియోజకవర్గ పరిధిలోని బొమ్మూరులో ఏర్పాటు చేశారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ కడియం నర్సరీలుఇప్పటి వరకూ ఎన్నికై న ఎమ్మెల్యేలు 1972 బత్తిన సుబ్బారావు (కాంగ్రెస్) 1978 పాటంశెట్టి అమ్మిరాజు (జనతా పార్టీ) 1983 గిరజాల వెంకటస్వామి నాయుడు (స్వతంత్ర) 1985 వడ్డి వీరభద్రరావు (టీడీపీ) 1989 జక్కంపూడి రామ్మోహనరావు (స్వతంత్ర) 1994 వడ్డి వీరభద్రరావు (టీడీపీ) 1999 జక్కంపూడి రామ్మోహనరావు (కాంగ్రెస్) 2004 జక్కంపూడి రామ్మోహనరావు (కాంగ్రెస్) రూరల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009 చందన రమేష్ (టీడీపీ) 2014 గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ) 2019 గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ) ఓటర్ల వివరాలు మొత్తం ఓటర్లు : 2,72,826 పురుషులు : 1,33,241 సీ్త్రలు : 1,39,561ఇతరులు : 24 -
పురాతన చరిత్ర నిడదవోలు సొంతం
● నియోజకవర్గం ఏర్పడింది మాత్రం 2009లోనే.. ● చాళుక్యులు, కాకతీయులు ఏలిన పట్టణం ● పురాతన శైవాలయాలకు, చర్చిలకు ప్రసిద్ధి నిడదవోలు: ఘనమైన చరిత్ర గల పురాతన పట్టణం నిడదవోలు. పూర్వం నిరవజ్జపురం, నిరవజ్జప్రోలు అనే పేర్లతో ప్రసిద్ధి పొంది నేడు నిడదవోలుగా పిలువబడుతోంది. ఈ పట్టణాన్ని మొదట చాళుక్యరాజులు పాలించారు. అనంతరం వారు కాకతీయ రాజులతో వియ్యం అందుకోవడంతో కాకతీయులు కొంతకాలం ఏలారు. వీరి హయాంలో శిల్పకళ అభివృద్ధి చెందింది. కొన్నేళ్ల క్రితం పట్టణంలో జరిపిన తవ్వకాల్లో బయటపడిన అందమైన విగ్రహాలు కాకతీయుల చరిత్రకు నిదర్శనంగా నిలిచాయి. నిడదవోలు పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చినకాశిరేవులో సుమారు 30 ఆలయాలున్నాయి. పట్టణంలోని పురాతన గోలింగేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మండలంలోని తిమ్మరాజుపాలెంలో కొలువైన కోట సత్తెమ్మ వారి ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి ఏడాదికి రూ.3 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. పట్టణంలోని చర్చిపేటలో 100 ఏళ్ల చరిత్ర గల కృపాధార లూథరన్ దేవాలయం, కురేషియా పెద మసీదులు ఎంతో పేరు గాంచాయి. రాజకీయ పోరు నిడదవోలు నియోజకవర్గం 2009లో ఏర్పడింది. తొలిసారిగా 2009లో నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో శేషారావు 5,766 ఓట్ల మెజారిటీతో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జి.శ్రీనివాస్నాయుడిపై విజయం సాధించారు. ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన రుద్రరాజు గజపతి కుమార్ రాజుకు 44,511 ఓట్లు దక్కాయి. 2014 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికే చెందిన బూరుగుపల్లి శేషారావు రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో శేషారావుకు 81,591 ఓట్లు రాగా, వైఎస్సార్ సీసీ తరుఫున పోటీ పడిన ఎస్.రాజీవ్కృష్ణకు 75,232 ఓట్లు దక్కాయి. బూరుగుపల్లి శేషారావుకు 6,352 ఓట్ల మెజార్టీ లభించింది. పోలింగ్ శాతం 85.56గా నమోదైంది. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన జి.శ్రీనివాస్నాయుడు 24,000 ఓట్ల మెజారిటీతో గెలిచాలి. ఆయన ప్రధాన ప్రత్యర్థి బూరుగుపల్లి శేషారావు. నియోజకవర్గ స్వరూపం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో నిడదవోలు నియోజకవర్గం ఏర్పడింది. నిడదవోలు మున్సిపాలిటీతో పాటు నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలు ఇందులో చేరి ఉన్నాయి. అంతకు ముందు నిడదవోలు పట్టణంతో పాటు నిడదవోలు మండలం కొవ్వూరు నియోజకవర్గంలోను, ఉండ్రాజవరం మండలం తణుకు నియోజకవర్గంలోను, పెరవలి మండలం పెనుగొండ నియోజకవర్గంలోను అంతర్భాగంగా ఉండేవి. 1999 ఎన్నికల నాటికి పూర్వపు ఉమ్మడి గోదావరి జిలాల్లో 16 నియోజకవర్గాలు ఉండేవి. ఆ ఎన్నికల్లో మొత్తం 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యాయి. ఒక్క కొవ్వూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జీఎస్ రావు మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్ సీపీ రాష్ట్ర సలహామండలి సభ్యుడిగా దివంతగ మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు జీఎస్రావు పీసీసీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. భౌగోళిక స్వరూపం నిడదవోలు అసెంబ్లీ సెగ్మెంట్ 282.92 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. సరిహద్దులుగా తూర్పున గోదావరి (ఆచంట నియోజకవర్గం), పడమరన గోపాలపురం నియోజకవర్గం (దేవరపల్లి మండలం), ఉత్తరాన కొవ్వూరు నియోజకవర్గం (చాగల్లు మండలం) దక్షిణాన తాడేపల్లిగూడెం నియోజకవర్గం (తాడేపల్లిగూడెం మండలం). కాగా నియోజకవర్గ కేంద్రమైన నిడదవోలు ద్వితీయ శ్రేణి మునిసిపాలిటీ. ప్రధాన పంటలు నియోజకవర్గంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. మూడు మండలాల్లోని 36,500 ఎకరాల్లో వరి, 1,500 ఎకరాల్లో అరటి, కంది, పసుపు, జామ, కోకో, ఆకుకూరలు, పూల తోటలు సాగులో ఉన్నారు. చెంతనే పశ్చిమ డెల్టా గోదావరి ప్రధాన కాలువ జీవ నదిని తలపిస్తూ ప్రవహిస్తోంది. సాగునీటి ఇబ్బందులు లేకుండా ఏటా పుష్కలంగా రెండు పంటలు పండుతున్నాయి. జూన్ 2019 నుంచి నుంచి ఫిబ్రవరి 2024 వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గ ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1450 కోట్లు ఖర్చు చేసింది. అలాగే నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.670 కోట్లు వెచ్చింది. నిడదవోలు నియోజకవర్గంలో... నిడదవోలు పురపాలక సంఘం నిడదవోలు మండలం ఉండ్రాజవరం మండలం పెరవలి మండలం వివిధ సంక్షేమ పథకాలు.. లబ్ధిదారుల వివరాలు, పొందిన మొత్తం వివరాలు పథకం లబ్ధిదారులు (లబ్ధి రూ.కోట్లలో) జగనన్న అమ్మఒడి 22,260 109.60 జగనన్న వసతి దీవెన 4,818 15.41 జగనన్న విద్యాదీవెన 14,427 42.61 వైఎస్సార్ రైతు భరోసా 22,726 126.83 వైఎస్సార్ సున్నా వడ్డీ (రైతులకు) 7,761 2.12 వైఎస్సార్ ఉచిత పంటల బీమా 14,510 35.57 రైతుల ఇన్పుట్ సబ్సిడీ 9,444 14.07 వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్హెచ్జీ) 15,560 34.98 వైఎస్సార్ పింఛను కానుక 33,553 373.84 వైఎస్సార్ చేయూత 9,044 59.24 వైఎస్సార్ ఆసరా 4,815 185.36 వైఎస్సార్ బీమా 196 4.99 వైఎస్సార్ కాపు నేస్తం 4,344 15.77 జగనన్న చేదోడు 1,281 2.59 ఇతర పథకాలు వైఎస్సార్ వాహనమిత్ర 1,300 3.10 వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 1,288 1.98 వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 14,940 51.47 ఆగ్రి గోల్డ్ బాధితులకు సాయం 2,102 1.32 వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా 284 1.64 లా నేస్తం 78 11 ( రూ.లక్షలు) అర్చకులు, ఇమాం, మౌజ్, పాస్టర్లు 244 27 (రూ. లక్షలు నేతన్న నేస్తం 08 04 (రూ.లక్షలు) నాన్ డీబీటీ పథకాలు జగనన్న తోడు 3,205 4.14 జగనన్న గోరుముద్ద 32,672 2.29 వైఎస్సార్ సంపూర్ణ పోషణ 40,496 29.92 జగనన్న విద్యాకానుక 41,069 6.69 ఇళ్ల స్థలాలు (భూసేకరణ) 11,197 109.90 ఇంటి రుణాలు 10,200 193.29 ఓటీఎస్ పట్టాలు 7,362 2.99 వైఎస్సార్ కంటి వెలుగు 6,449 32 ( రూ.లక్షలు) నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,396 పురుషులు 1,04,235 మహిళలు 1,09,157 ఇతరులు 04 పట్టణం, మండలాల వారీగా.. నిడదవోలు మునిసిపాలిటీ 35,112 నిడదవోలు మండలం 58,216 ఉండ్రాజవరం 62,362 పెరవలి 57,706 మొత్తం పోలింగ్ స్టేషన్లు 205 -
పోస్టల్ బ్యాలెట్.. రైట్రైట్
● నేటి నుంచి ఓటింగ్ ప్రారంభం ● జిల్లా వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు ● ప్రతి ఉద్యోగీ వినియోగించుకునేలా అవకాశం ● జిల్లా వ్యాప్తంగా 11,988 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక సమరంలో అత్యంత కీలకమైన పోలింగ్ ఘట్టానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, 40 శాతం మించి వైకల్యంతో బాధ పడుతున్న దివ్యాంగ ఓటర్లకు ఇంటి వద్దనే ఓటు వేసే సరికొత్త విధానానికి ఎన్నికల సంఘం ఈ ఏడాది శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ జిల్లాలో ఇప్పటికే మొదలైంది. హోం ఓటింగ్లో ఇంకా మిగిలిన వారికి మరోసారి అవకాశం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఉద్దేశించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు కూడా సోమవారం శ్రీకారం చుడుతున్నారు. దీనిని ప్రతి ఉద్యోగీ తప్పనిసరిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే రాజకీయ పార్టీలకు సమాచారం అందించారు. రాజకీయ పార్టీల నేతలు వారి తరఫున ఏజెంట్లను నియమించుకుని, సంబంధిత రిటర్నింగ్ అధికారికి వివరాలు తెలపాల్సి ఉంటుంది. ఎవరెవరికి ఎప్పుడంటే.. ● జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, ప్రభుత్వ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోనున్నారు. ● జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 11,988 ఉన్నాయి. ఉద్యోగులు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలనే విషయమై ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ● పీఓ, ఏపీఓలకు ఆయా నియోజకవర్గాల పరిధిలో సోమవారం శిక్షణ అనంతరం పోస్టల్ బ్యాలెట్ వి నియోగించుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ● పోలీసులకు మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తారు. ● మైక్రో అబ్జర్వర్లకు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో మంగళవారం ఉదయం 9 గంటలకు శిక్షణ ఇస్తారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలోని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తారు. ● అత్యవసర సేవలు నిర్వహించే ఉద్యోగులకు పిడింగొయ్యి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ న్యూ క్యాంపస్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ఏర్పాటు చేశారు. వీరు మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు. ● ఇతర పోలింగ్ సిబ్బందికి వారికి కేటాయించిన నియోజకవర్గాల పరిధిలోని శిక్షణ కేంద్రాల్లో బుధవారం శిక్షణ ఇస్తారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు అవకాశం కల్పిస్తారు. నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ● అనపర్తి: పీఓ/ఏపీఓలకు శ్రీ రామారెడ్డి జెడ్పీపీ హైస్కూల్, అనపర్తి, ఇతర పోలింగ్ సిబ్బందికి జీబీఆర్ కాలేజీ. ● రాజానగరం: బీవీసీ ఇంజినీరింగ్ కాలేజీ, పాలచర్ల. ● రాజమండ్రి సిటీ: బుద్ధ భవన్, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల. ● రాజమండ్రి రూరల్: ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, కవలగొయ్యి, పిడింగొయ్యి. ● కొవ్వూరు: శ్రీ సుందర శ్రీ కల్యాణ మండపం. ● నిడదవోలు: వికాస్ జూనియర్, డిగ్రీ కళాశాల, సమిశ్రగూడెం. ● గోపాలపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్న అధికారులుప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. పోస్టల్ బ్యాలెట్కు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం. ఎన్నికల విధులకు ఉత్తర్వులు వచ్చిన వారు వారికి కేటాయించిన ఫెసిలిటేషన్ సెంటర్లలో సోమ, మంగళ, బుధవారాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ఎలాంటి డ్యూటీ ఆర్డర్లూ పొందని ఉద్యోగులు ఈ నెల 13వ తేదీన నేరుగా సంబంధిత పోలింగ్ కేంద్రంలో వారి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓ, ప్రభుత్వ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోనున్నారు. – కె.మాధవీలత, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, రాజమహేంద్రవరం నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నియోజకవర్గం పీఓ, ఏపీఓ ఓపీ ప్రభుత్వ మైక్రో ఓట్లు ఉద్యోగులు అబ్జర్వర్లు అనపర్తి 314 446 131 6 రాజానగరం 667 512 263 15 రాజమండ్రి సిటీ 694 556 31 97 రాజమండ్రి రూరల్ 657 481 166 1 కొవ్వూరు 399 482 239 7 నిడదవోలు 424 461 132 10 గోపాలపురం 372 377 129 11 జిల్లా స్థాయి అధికారులు 1,550 195 ఎసెన్షియల్ ఉద్యోగులు 342 పోలీసులు 1821
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement