17 నుంచి ధనుర్మాస ఉత్సవాలు | Sakshi
Sakshi News home page

17 నుంచి ధనుర్మాస ఉత్సవాలు

Published Fri, Dec 15 2023 1:00 AM

-

అర్వపల్లి : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి ధనుర్మాస ఉత్సవాలు జరగనున్నాయి. ఏటా ఈ దేవాలయంలో నెల రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి కూడా ఉత్సవాలు నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా రోజూ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రామస్తులు అంతా కలిసి రాజకీయాలకతీతంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ముక్కోటి ఏకాదశి, కూడారై, గోదారంగనాథస్వామి కల్యాణోత్సవం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు అర్వపల్లి రాంబాబుఅయ్యంగార్‌, పవన్‌కుమార్‌ తెలిపారు. భక్తులు తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈఓ కోరారు.

Advertisement
Advertisement