అమిత్‌షా సభను జయప్రదం చేయాలి | Sakshi
Sakshi News home page

అమిత్‌షా సభను జయప్రదం చేయాలి

Published Sun, Nov 26 2023 2:06 AM

సభ నిర్వహించే స్థలంలో  ఏర్పాట్లను పరిశీలిస్తున్న 
గూడూరు నారాయణరెడ్డి తదితరులు - Sakshi

సాక్షి యాదాద్రి: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సభకు బీజేపీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని భువనగిరి బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి వద్ద సభా ఏర్పాట్లను జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావుతో కలిసి ఆయన పరిశీలించారు. అధికారులు, పార్టీ నాయకులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నం 2గంటలకు సభ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ సభకు 50 వేల మందిని తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. తనతో పాటు ఆలేరు నియోజకవర్గ అభ్యర్థి పడాల శ్రీనివాస్‌ సభలో పాల్గొంటారని తెలిపారు. సభా వేదిక పక్కనే హెలిపాడ్‌ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణాన్ని ఎస్‌పీజీ, కేంద్ర భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

Advertisement
Advertisement