సాక్షి, యాదాద్రి : ప్రధాన పార్టీల అభ్యర్థులు సత్తా చాటడానికి నామినేషన్ల సందర్భంగా భారీ జన సమీకరణ చేస్తున్నారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ఈనెల 10వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పలువురు నామినేషన్ వేశారు.
బలనిరూపణకు ప్రాధాన్యం
నామినేషన్ రోజు అభ్యర్థులు తమ బలాన్ని చాటుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున జనాలను తరలిస్తున్నారు. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్కుమార్రెడ్డి బుధవారం భారీ జనంతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్, బర్రె జహంగీర్ ఉన్నారు. బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి సాదాసీ దాగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు పీవీ శ్యాంసుందర్రావు, జిల్లా ఇన్చార్జ్ సోము వీర్రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాశం భాస్కర్ వచ్చారు. నారాయణరెడ్డి 10వ తేదీన మరోసారి జనంతో వచ్చి నామినేషన్ వేయనున్నారు. జనసమీకరణలో ఆయన నిమగ్నమయ్యారు. ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడిసునీత తరపున ఆమె భర్త, డీసీసీబీ చైర్మన్ గొంగిడిమహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం జనంతో వచ్చి మరోసారి నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య తరఫున ఆయన సతీమణి బీర్ల అనిత, అనుచరుడు చెరొక సెట్ నామినేషన్లు వేశారు. గురువారం ఆలేరులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి హాజరుకానున్నారు. సభకు భారీగా జనాన్ని తరలించేందుకు అయిలయ్య, అతని అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి పై శేఖర్రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఆలేరు బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ 10న ఐదు వేల బైకులతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేస్తారు.
ఫ భారీ ర్యాలీలు, బహిరంగ సభలు
ఫ వేలాది మందితో వచ్చి నామినేషన్ వేసిన కుంభం అనిల్కుమార్రెడ్డి
ఫ నేడు ఆలేరులో కాంగ్రెస్ సభ
ఫ రేపు బైక్ ర్యాలీలతో వచ్చి నామినేషన్
వేయనున్న బీజేపీ అభ్యర్థులు