ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటుతోనే సాధ్యం | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటుతోనే సాధ్యం

Published Tue, May 14 2024 1:05 PM

ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటుతోనే సాధ్యం

అలంపూర్‌: ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటుతోనే సాధ్యమని నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. అలంపూర్‌ హరిజనవాడ పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో ఆయన సోమవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అనంతరం మాట్లాడుతూ.. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కల్పించిన రాజ్యాంగబద్దమైన ఓటు హక్కును సొంతగడ్డ అలంపూర్‌లో వినియోగించుకున్నానని అన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వృథా కావద్దన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం.. రాజ్యాంగాన్ని పరీరక్షించడం కోసం ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తన ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement