Sakshi News home page

నీటి సంపులో పడి సెక్యూరిటీ గార్డు మృతి

Published Thu, Mar 28 2024 12:55 AM

వివరాలు సేకరిస్తున్న పోలీసులు - Sakshi

కూర్మన్నపాలెం: డ్యూటీలో ఉంటూ నీటి సంపులో పడి ఓ సెక్యూరిటీ గార్డు మృతి చెందిన ఘటన దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అనకాపల్లి జిల్లా కశింకోట గ్రామానికి చెందిన అల్లవరపు గణేష్‌ (32) అటోనగర్‌లోని ఎస్‌ బ్లాక్‌ వద్ద ఉన్న టీపీఎల్‌ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్య దేవి కూడా ఆటోనగర్‌లో పనిచేస్తున్నారు. వీరు దువ్వాడ సెక్టార్‌ – 1 మంగళపాలెం శ్రీసాయినగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నైట్‌ డ్యూటీకి వెళ్లిన గణేష్‌ బుధవారం ఉదయం టీపీఎల్‌ కంపెనీలో ఉన్న నీటి సంపులో విగతజీవిగా పడి ఉన్నాడు. నీటి సంపుపై రక్షణగా జాలీ లేదు. దీంతో టీపీఎల్‌ కంపెనీ యాజమాన్యం దువ్వాడ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గణేష్‌ భార్య దేవికి అక్కడే పనిచేస్తున్న కంఠపురెడ్డి శ్రీను విషయం తెలియపరిచాడు. వెంటనే అక్కడికి చేరుకున్న భార్య దేవి దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement