మోమిన్పేట: మూడోసారి ఓటమి తప్పదని గుర్తించిన మాజీ మంత్రి ప్రసాద్కుమార్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత, చీమల్దరి సర్పంచ్ నాసన్పల్లి నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మోమిన్పేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రసాద్కుమార్ తనపై చేసిన వ్యక్తిగత ఆరోపణలను ఖండించారు. ప్రసాద్కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో తమ గ్రామాభివృద్ధికి రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. తమ గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు రావడాన్ని జీర్ణించుకోలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనతో పాటు తమ పార్టీ పెద్దలపై చేసిన ఆరోపణలన్నీ ఆయనకే వర్తిస్తాయని ఎద్దేవాచేశారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక నిరాధార ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, బదిలీలు చేయిస్తానని చెప్పి ఎవరివద్ద ఎంత తీసుకున్నాడో.. తన వద్ద సాక్ష్యాధారాలున్నాయని తెలిపారు. వికారాబాద్లో ఉన్న భూమిని నలుగురికి అమ్మి.. అడ్వాన్సులు తీసుకుని బెదిరించిన సంగతి నిజం కాదా..? అని ప్రశ్నించారు. స్థానికుల సహకారంతోనే తమ గ్రామంలో గుడి నిర్మించుకున్నామని వివరించారు. తాను ఒక్క గుంట భూమిని కబ్జా చేసినట్లు నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఎంపీ రంజిత్రెడ్డి రూ.300 కోట్లు కాదు కదా.. రూ.30 అవినీతి చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. ఆయన చెప్పినవన్నీ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరనే విషయం గుర్తించాలని సూచించారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలను మానుకోకపోతే ఆయన బండారం అంతా బయట పెడుతామని హెచ్చరించారు.
ఓటమి తప్పదనే..
Published Wed, Nov 22 2023 4:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement