తాండూరు టౌన్: తాండూరు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ అభ్యర్థికే కేటాయించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి కోరారు. బీజేపీ – జనసేన పొత్తులో భాగంగా తాండూరు స్థానాన్ని జనసేన అభ్యర్థి శంకర్గౌడ్కు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ స్థానిక నాయకులు నిరాశకు గురయ్యారు. పలు దఫాలు పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపారు. అయితే జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్కుమార్ బుధవారం బీజేపీ తరఫున నామినేషన్ వేసేందుకు ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. అయితే సమయం ముగియడంతో వెనుదిరిగారు. గురువారం నామినేషన్ వేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సదానందరెడ్డి మాట్లాడుతూ.. తాండూరులో పార్టీకి బలం ఉందని, రమేష్కుమార్కు ఈ సారి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి