Sakshi News home page

పోలింగ్‌ ఏర్పాట్ల పరిశీలన

Published Wed, Apr 17 2024 12:30 AM

పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ వలర్మతి - Sakshi

తిరుత్తణి: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌ ఏర్పాట్లను రాణిపేట కలెక్టర్‌ వలర్మతి పరిశీలించా రు. ఇందులో భాగంగా ఆమె తిరుత్తణిలోని పోలింగ్‌ కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు. తిరుత్తణి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 330 పోలింగ్‌ కేంద్రాలకు పోలింగ్‌ సామగ్రి సిద్ధం చేయడం, పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లకు సంబంధించి రాణి పేట కలెక్టర్‌ వలర్మతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్లకు రాజకీయ పార్టీ ల అభ్యర్థులు నగదు పంచడంపై పక్కా ఆధారాలతో సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల అధికారులపై పీఎంకే అభ్యర్థి చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించ లేదన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ దీప, డీఎస్పీ విఘ్నే ష్‌, తహసీల్దార్‌ మదియళగన్‌ ఉన్నారు.

Advertisement
Advertisement