అర్హులైన అంధులకు ఓటు హక్కు కల్పించాలి | Sakshi
Sakshi News home page

అర్హులైన అంధులకు ఓటు హక్కు కల్పించాలి

Published Thu, Nov 9 2023 1:40 AM

బ్రెయిలీలిపిలో గల బ్యాలెట్‌ నమూనా పోస్టర్‌ను  ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌
 - Sakshi

దురాజ్‌పల్లి (సూర్యాపేట) : అర్హులైన అంధులకు ఓటు హక్కు కల్పించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావు ఆదేశించారు. అంధులకు ఓటు హక్కు వినియోగంపై బ్రెయిలీలిపిలో గల బ్యాలెట్‌ నమూనా పోస్టర్‌ను ఆవిష్కరించి కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో 2,113 మంది అర్హులైన అంధులు ఉన్నారని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలన్నారు. వికలాంగుల సౌకర్యార్థం పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇప్పటికే జిల్లాకు 728 వీల్‌ చైర్స్‌ వచ్చినట్ల్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జ్యోతి పద్మ, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ అనిత పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement