నామినేషన్లు రేపే ఆఖరు | Sakshi
Sakshi News home page

నామినేషన్లు రేపే ఆఖరు

Published Thu, Nov 9 2023 1:40 AM

చండూరులో నామినేషన్‌ పత్రం అందజేస్తున్న బీఎస్సీ మునుగోడు అభ్యర్థి శంకరాచారి - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. ఈ నెల 10న నామినేషన్ల ఘట్టానికి తెరపడనుంది. ఈ నెల 3వ తేదీతో ప్రారంభమైన నామినేషన్ల పర్వం శుక్రవారంతో పూర్తవుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజక వర్గాల పరిధిలో ఇప్పటి వరకు కొద్ది మంది మాత్రమే అధికార, ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 9వ తేదీ గురువారం ఏకాదశి కూడా కావడంతో మంచి రోజని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు.

ముఖ్య నాయకులంతా నేడే..

అన్ని నియోజకవర్గాల్లో గురువారం బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, సీపీఎం, బీజేపీ, ఫార్వర్డు బ్లాక్‌, ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నల్లగొండ నియోజక వర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డితో పాటు ఫార్వర్డు బ్లాక్‌ పార్టీ అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. సూర్యాపేట నుంచి అధికార పార్టీ అభ్యర్థి, మంత్రి జగదీష్‌రెడ్డి ,కాంగ్రెస్‌ పార్టీ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నామినేషన్‌ వేయనున్నారు. నాగార్జునసాగర్‌ లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డి గురువారం నామినేషన్లు వేయనున్నారు. కోదాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి, తుంగతుర్తిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిషోర్‌కుమార్‌, బీజేపీ అభ్యర్థి కడియం రామచంద్రయ్య, మునుగోడులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి నామినేషన్లు వేయనున్నారు. భువనగిరిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి నామినేషన్‌ వేయనుండగా, నకిరేకల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వేముల వీరేశం, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య కూడా గురువారం నామినేషన్లు వేయనున్నారు. మిర్యాలగూడలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి , సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి , బీజేపీ నుంచి సాధినేని శ్రీనివాసరావు నామినేషన్‌ సమర్పించనున్నారు. హుజూర్‌నగర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్‌ సమర్పించనున్నారు. దేవరకొండ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, బీజేపీ అభ్యర్థి కేతావత్‌ లాలునాయక్‌ నామినేషన్లు వేయనున్నారు. ఆలేరులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునిత, కాంగ్రెస్‌ అభ్యర్థి బీర్ల ఐలయ్య నామినేషన్లు సమర్పించనున్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులంతా గురువారమే నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్లు చివరి రోజు శనివారం తక్కువగానే దాఖలు కానున్నాయి.

ఫ నేడు ఏకాదశి కావడంతో అత్యధికంగా దాఖలయ్యే అవకాశం

ఫ ముహూర్తం ఖరారు చేసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి, ఉత్తమ్‌, ముఖ్యనాయకులు

ఫ నామినేషన్లు వేయనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

ఫ కోలాహలంగా మారనున్న నియోజకవర్గ కేంద్రాలు

ఫ చివరి రోజు దాఖలయ్యేది తక్కువే..

ఇప్పటి వరకు

మొత్తం

నియోజకవర్గాల వారీగా దాఖలైన నామినేషన్లు

నల్లగొండ 9 22

కోదాడ 7 16

సూర్యాపేట 7 19

మునుగోడు 12 25

నాగార్జునసాగర్‌ 5 13

నకిరేకల్‌ 5 16

ఆలేరు 8 15

తుంగతుర్తి 3 07

మిర్యాలగూడ 12 25

భువనగిరి 3 14

హుజూర్‌నగర్‌ 3 07

దేవరకొండ 4 09

మొత్తం 81 188

1/1

Advertisement
Advertisement