విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి | Sakshi
Sakshi News home page

విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి

Published Thu, Mar 30 2023 12:44 AM

అగ్నిమాపక శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న జేసీ కేతన్‌గార్గ్‌  - Sakshi

పుట్టపర్తి టౌన్‌: విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలని జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) టీసీ చేతన్‌ తెలిపారు. బుధవారం పుట్టపర్తిలో జిల్లా విపత్తు స్పందన – అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హ్యూందాయ్‌, గ్లోవియస్‌ ప్రైవేటు ఇండియా లిమిటెడ్‌ వారు రూ. 64 లక్షలతో కార్యాలయాన్ని నిర్మించడం అభినందనీయమమన్నారు.ఉన్న స్థలంలోనే సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడంపై అగ్ని మాపక సిబ్బందిని అభినందించారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శంకరప్రసాద్‌ మాట్లాడుతూ విపత్తుల కట్టడికి శక్తి వంచన లేకుండా పని చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హ్యూందాయ్‌ గ్లోవీఎస్‌ ప్రైవేట్‌ ఇండియా లిమిటెడ్‌ ఎండీ జూసిఒక్‌ఓ, హెచ్‌ఓడీ జేసుకుమార్‌, కర్నూల్‌ జోన్‌ ఆర్‌ఎఫ్‌ఓ భూపాల్‌రెడ్డి, అనంతపురం ఎఫ్‌ఓ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement