Sakshi News home page

కావ్య.. ఇదేందయ్యా!

Published Wed, Mar 27 2024 12:10 AM

అల్లూరులోని టీడీపీ 
కార్యాలయంలో పగుల గొట్టిన తలుపు చక్కలు  - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ కావలి నియోజకవర్గ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తీరుపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందే కావ్య నిజ స్వరూపం బయటపడుతుండడంతో భగ్గుమంటున్నారు. ఇప్పటికే కావ్య వైఖరితో కావలిలో 40 ఏళ్ల నుంచి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలు, ఎన్టీఆర్‌ వీరాభిమానులు పార్టీకి దండం పెట్టి రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల అల్లూరు లో టీడీపీ కార్యాలయం తలుపులను కావ్య కృష్ణారెడ్డి సాక్షిగా ఆయనతోపాటు పార్టీలోకి వచ్చిన అల్లూరులో ని ఆయన బంధువులు కాళ్లతో తన్ని పగుల గొట్టిన ఘటన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మింగుడుపడడం లేదు. వివరాలు.. ఇటీవల అల్లూరులో అంకమ్మ తిరునాళ్లకు కావ్య కృష్ణారెడ్డి చందా ఇవ్వడంతో ఆయనను ఆహ్వానించారు. కావ్య అల్లూరుకు వస్తున్నారని తెలియడంతో ఆయన కోసం అల్లూరు లోని పార్టీ కార్యాలయంలో రాత్రి 11 గంటల వరకు నాయకులు, కార్యకర్తలు ఎదురుచూశారు. ఎంతకూ రాకపోవడం, ఫోన్‌లకు స్పందించక పోవడంతో కార్యకర్తలు కార్యాలయా నికి తాళం వేసి వెళ్లిపోయారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో అల్లూరుకు చేరుకున్న కావ్య కృష్ణారెడ్డి పార్టీ ఆఫీసుకు తాళం వేసి ఉండడంతో అసహనానికి గురై తనతో వచ్చిన తన వర్గీయులతో తలుపులు పగులగొట్టించా డు. తరువాత పార్టీ ఆఫీసులో కూర్చుని గంటసేపు స్థానిక రాజకీయాలపై అల్లూరుకు చెందిన తన దూరపు బంధువులతో చర్చలు జరిపాడు. ఈ విష యం తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. పార్టీ కార్యాలయం తలుపులనే పగులగొట్టించిన వ్యక్తి ప్రజలను ఏం గౌర విస్తాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి మద్దతుగా తిరగడం మావల్ల కాదంటూ చేతులెత్తేశా రు. విషయం బయటకు వస్తే పార్టీ పరువుపోతుందనే ఉద్దేశంతో బీద గిరిధర్‌ వర్గీయులు గుట్టుచప్పుడు కా కుండా కొత్త తలుపును ఏర్పాటు చేయించారు. ప్రస్తు తం అల్లూరులో ఈ ఘటన హాట్‌ టాపిక్‌గా మారింది.

అల్లూరులో టీడీపీ ఆఫీస్‌ తలుపులు

పగులగొట్టించిన వైనం

బయటపడుతున్న కావ్య నిజ స్వరూపం

లోలోన ఉడికిపోతున్న నేతలు, కార్యకర్తలు

Advertisement

What’s your opinion

Advertisement