వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆక్టోబర్ 19న పుణే వేదికగా భారత్- బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఎటువంటి వ్యూహాలు రచించడం లేదని మాంబ్రే స్పష్టం చేశాడు.
కాగా షకీబుల్ హసన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. భారత్పై కూడా చాలా మ్యాచ్లలో షకీబ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లిపై అతడికి అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 14 వన్డేల్లో 5 సార్లు విరాట్ను షకీబ్ ఔట్ చేశాడు.
"ప్రతీ ఒక్క బ్యాటర్కు బౌలింగ్ మ్యాచ్ అప్లు ఉంటాయి. కొన్ని మ్యాచ్ల్లో బ్యాటర్లు వారిపై పై చేయి సాధిస్తే.. మరి కొన్ని మ్యాచ్ల్లో బౌలర్లు అధిపత్యం చెలాయిస్తారు. షకీబ్కు విరాట్పై మంచి రికార్డు ఉందని తెలుసు. కానీ ఆ విషయం గురించి ట్రైనింగ్ సెషన్స్లో అస్సలు మేము చర్చించలేదు. షకీబ్ అద్బుతమైన ఆటగాడు.
పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ చేయగలడు. అతడు బంగ్లాదేశ్కు ఛాంపియన్ ప్లేయర్ అని మాకు తెలుసు. కానీ అతడి కోసం మేము ఎటువంటి ప్రణాళికలను సిద్దం చేయలేదు.బంగ్లాతో మ్యాచ్లో మేము ఏమో చేయాలో మాకు సృష్టంగా తెలుసు అని మాంబ్రే పేర్కొన్నాడు.
చదవండి: World Cup 2023: టీమిండియాను ఓడిస్తే బంగ్లా క్రికెటర్తో డేటింగ్ చేస్తా: పాక్ నటి