యజమాని రామ్నాథ్
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(బి)లో గల ట్రైడెంట్ చక్కెర కర్మాగారాన్ని అమ్మక బదాలాయింపు చేస్తున్నట్లు యజమాని రామ్నాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా చెరకు రైతుల బకాయిలను వారికి సకాలంలో చెల్లించలేక పోయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో బకాయి పడ్డ మొత్తం రూ.9కోట్లను చెల్లించనున్నట్లు తెలిపారు. రెండేళ్లుగా కర్మాగారాన్ని వేరే యాజమాన్యానికి నడపడానికి గాను ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. దీంతో రైతులకు 2022–23 సీజన్కు గాను పైబకాయి చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే కె.మాణిక్రావు, కలెక్టర్ శరత్కు ఈ విషయమై హామీ ఇచ్చానని తెలిపారు. అయినా సకాలంలో బిల్లులు చెల్లించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థి
క్రాంతికిరణ్ వాహనం తనిఖీ
సంగారెడ్డి టౌన్: అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. బుధవారం సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట వద్ద వాహనాన్ని ఆపేసి తనిఖీ చేపట్టారు. కాగా పోలీసు బృందాలు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ముమ్మరం చేశాయి.