‘కారు’తోనే ‘పట్నం’లో వెలుగులు | Sakshi
Sakshi News home page

‘కారు’తోనే ‘పట్నం’లో వెలుగులు

Published Mon, Nov 20 2023 4:28 AM

పోల్కంపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి    - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌: బీఆర్‌ఎస్‌తోనే నియోజకవర్గంలో వెలుగులు నిండాయని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ప్రచారంలో భాగంగా మండల పరిధిలోని పోల్కంపల్లి, నాగన్‌పల్లి, ఎన్గల్‌గూడ, జాజోనిబావి, మన్నెగూడ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. పోల్కంపల్లి నుంచి అనాజ్‌పూర్‌ వరకు పెద్ద రోడ్డు వేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. నిరుపేదల సంక్షేమం అభివృద్ధికోసం పాటుపడుతున్న పార్టీకే ఓటు వేయాలని కోరారు. ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి సూమరు 1200 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు పేదలకు సహకకరించామగని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు మోసం చేసేందుకు యత్నిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండి కారు గుర్తుకు ఓటేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోల్కంపల్లి ఎంపీటీసీ సభ్యురాలు మంగ, ఎంపీపీ కృపేష్‌, సర్పంచ్‌ ఆండాలు, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజశేఖర్‌రెడ్డి, వినోద్‌రెడ్డి , నర్సింహ, బాలు, చందు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement