రాజన్న సేవలో ప్రముఖులు | Sakshi
Sakshi News home page

రాజన్న సేవలో ప్రముఖులు

Published Fri, May 10 2024 11:50 PM

రాజన్న సేవలో ప్రముఖులు

వేములవాడ: రాజన్నను ఎస్బీఐ డీజీఎం వివేక్‌ జైస్వాల్‌, సినీ దర్శకుడు ఎల్దండి వేణులు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. అనంతరం వేదోక్త ఆశీర్వచనం గావించారు. ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, ప్రొటోకాల్‌ పర్యవేక్షకులు శ్రీరాములు, ఎస్బీఐ ఆర్‌ఎం వెంకటేశ్‌, స్థానిక బ్రాంచ్‌ మేనేజర్‌ సుబ్బారావు పాల్గొన్నారు.

వీర్నపల్లి మోడల్‌స్కూల్‌లో డీఎస్పీ విచారణ

వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో శుక్రవారం డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి విచారణ చేశారు. గత నెల 18న సమస్యలతోపాటు నిధుల వివరాలను విద్యార్థి సంఘం నాయకుడు హరీశ్‌ ప్రిన్సిపాల్‌ను నిలదీశాడు. దీనికి కోపోద్రిక్తుడైన ప్రిన్సిపాల్‌ హరీశ్‌ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement