సింగరాయకొండలో కారు చోరీ | Sakshi
Sakshi News home page

సింగరాయకొండలో కారు చోరీ

Published Sat, Dec 16 2023 1:30 AM

-

సింగరాయకొండ: ఇంటి ముందు నిలిపి ఉంచిన కారును దొంగలు అపహరించిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో చోటుచేసుకుంది. వివరాలు.. మూలగుంటపాడు పంచాయతీ గాంధీనగర్‌ రోడ్డులో నివసిస్తున్న నేలపాటి శంకర్‌ తన ఇంటి వద్ద కారు నిలిపి ఉంచాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున నిద్ర లేచి చూడగా కారు కనిపించలేదు. దొంగలు చోరీ చేశారని గ్రహించిన శంకర్‌ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ దాచేపల్లి రంగనాథ్‌ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీరామ్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement