బావమరిదిని కాల్చిచంపిన బావ
పర్లాకిమిడి: సొంత బావమరిదిని నాటుతుపాకీతో కాల్చి చంపిన ఘటన గజపతి జిల్లా బలియాగోణి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. మోహానా పోలీస్స్టేషన్ పరిధిలోని బలియాగోణి గ్రామంలో కై లాష్ నాయక్ (56) శనివారం సాయంత్రం అటవీ ప్రాంతానికి కట్టెలు తీసుకొచ్చేందుకు వెళ్లాడు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మోహానా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, బంధువులు అటవీ ప్రాంతంలో వెతకగా కై లాష్ నాయక్ మృతదేహం కనుగొన్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా పాతకక్షలతో సొంత బావ ఉదయ్ నాయక్ ఈ హత్య చేసినట్లు తేలడంతో అరెస్టుచేశారు. నిందితుడి నుంచి నాటుతుపాకీ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment