బావమరిదిని కాల్చిచంపిన బావ | - | Sakshi
Sakshi News home page

బావమరిదిని కాల్చిచంపిన బావ

Published Mon, Jun 17 2024 1:58 AM | Last Updated on Mon, Jun 17 2024 1:58 AM

బావమరిదిని  కాల్చిచంపిన బావ

బావమరిదిని కాల్చిచంపిన బావ

పర్లాకిమిడి: సొంత బావమరిదిని నాటుతుపాకీతో కాల్చి చంపిన ఘటన గజపతి జిల్లా బలియాగోణి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. మోహానా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బలియాగోణి గ్రామంలో కై లాష్‌ నాయక్‌ (56) శనివారం సాయంత్రం అటవీ ప్రాంతానికి కట్టెలు తీసుకొచ్చేందుకు వెళ్లాడు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మోహానా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, బంధువులు అటవీ ప్రాంతంలో వెతకగా కై లాష్‌ నాయక్‌ మృతదేహం కనుగొన్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా పాతకక్షలతో సొంత బావ ఉదయ్‌ నాయక్‌ ఈ హత్య చేసినట్లు తేలడంతో అరెస్టుచేశారు. నిందితుడి నుంచి నాటుతుపాకీ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement