రూ.10 లక్షల వ్యయంతో ఉత్సవాలు
ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలను సుమారు రూ.10 లక్షల వ్యయంతో నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా సుమారు రూ.1.25 లక్షలు అమ్మవారి మందిరానికి పెయింటింగ్స్ కోసం ఖర్చు చేయడం జరిగింది. తొమ్మిది రోజుల పాటు జరిగే పూజల కోసం మందిరాన్ని ముస్తాబు చేశాం. పట్టణ ప్రజల ఆర్థిక సాయంతో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నాం.
– పతివాడ శ్రీనివాస్రావు, కమిటీ అధ్యక్షుడు
సంప్రదాయ పద్ధతిలో పూజలు
అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాల్లో పూజా విధానాలు కొనసాగిస్తున్నాం. అమ్మవారికి ప్రీతికరమైన ఆదివాసీ డప్పు వాయిద్యాలతో పాటు విధివిధానాలను తూచ తప్పకుండా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా అమ్మవారి ఉత్సవ వేదిక వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు విరాళాలు ఇస్తుంటారు. ఆ మొత్తం అమ్మవారి ఉత్సవాల కోసం ఖర్చు చేస్తుంటాం.
– ఎద్దు శ్రీహరి, కమిటీ ఉపాధ్యక్షుడు
●
Comments
Please login to add a commentAdd a comment