దుర్గమ్మ సేవలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సేవలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి

Published Sun, Nov 19 2023 1:04 AM

విద్యావతికి అమ్మవారి చిత్రపటం 
అందజేస్తున్న ఈఓ, కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌   - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి వి.విద్యావతి శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువైన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన విద్యావతి, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు, విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌కు ఆలయ ఈఓ కె.ఎస్‌.రామారావు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఈఓ రామారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. సంగీత కళాకారుడు డాక్టర్‌ మల్లాది రవికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement