భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలి | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలి

Published Sat, Mar 25 2023 1:52 AM

ముస్లింలకు దుస్తులు పంపిణీ చేస్తున్న ఏఎస్పీ  - Sakshi

ఏటూరునాగారం: రంజాన్‌ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో ప్రజాసేన రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాబాఖాన్‌ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు, ముస్లిం మహిళలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం చేయగా ఏఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా కలవచ్చని తెలిపారు. బాబాఖాన్‌ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. పోలీస్‌ శాఖ నుంచి కూడా ముస్లిం కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ఏఎస్పీని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసేన జిల్లా అధ్యక్షుడు దేవి రెడ్డి వెంకట్‌ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చెలుమల సురేందర్‌, ముస్లిం మతపెద్దలు అష్రఫ్‌, ఇబ్రహీం, ఖలీల్‌, హమీద్‌, కమాలుద్దీన్‌, మైనుద్దీన్‌, గౌస్‌, సలీం, డింపులు తదితరులు పాల్గొన్నారు.

ఏఎస్పీ సంకీర్త్‌

Advertisement
Advertisement