కాగజ్నగర్రూరల్: పాఠశాల భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదని కాగజ్నగర్ పట్టణంలోని పెట్రోల్ పంపు జెడ్పీ ఉన్నత పాఠశాల గేటుకు సోమవారం సంబంధిత కాంట్రాక్టర్ తాళం వేశాడు. మన ఊరు– మన బడి పథకం కింద రూ.97 లక్షలతో కాంట్రాక్టర్ హబీబ్ పాఠశాల భవనం నిర్మించారు. పనులు పూర్తయి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు బిల్లులు మంజూరు కాలేదు. విసిగిపోయిన కాంట్రాక్టర్ సోమవారం ఉదయం స్కూల్ గేటుకు తాళం వేశాడు. సోమవారం నుంచే విద్యార్థులకు ఎస్ఏ– 2 పరీక్షలు ప్రారంభం కావడంతో సుమారు గంట సేపు పాఠశాల వద్దే పడిగాపులు కాశారు. విషయం తెలుసుకున్న అధికారులు మూడు రోజుల్లో బిల్లులు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్ గేటు తాళం తీశాడు.
Breadcrumb
- HOME
బిల్లు రాలేదని స్కూల్ గేటుకు తాళం
Published Tue, Apr 16 2024 12:00 AM
Related news
-
రేపు బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు
నస్పూర్: ఈ నెల 21న జిల్లా స్థాయి బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నస్పూర్ పట్టణంలోని కుమార్ గన్నర్స్ అకాడమీలో నిర్వహించనున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాదం రవీందర్, బోయిని రాజ్కుమార్ తెలిపా రు. అర్హులైన యువతీ, యువకులు ఒరిజినల్ ఆధార్కార్డు, జనన ధ్రువపత్రం, మెడికల్ సర్టిఫికేట్, రెండు పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 26నుంచి హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. -
సాదాసీదాగా ‘కొప్పుల’, వంశీ నామినేషన్
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి ఎంపీ స్థానానికి రెండోరోజు ముగ్గురు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్లో రిట ర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. శుక్రవారం ఏకాదశి మంచిరోజు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కో రుకంటి చందర్తో కలిసి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, నే తకాని సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం నరేశ్తో కలి సి నామినేషన్ వేశారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి మరో సెట్ అందజేశారు. వీరుకా కుండా బీఆర్ఎస్ తరఫున డమ్మీ అభ్యర్థిగా కొంకటి లింగమూర్తి ఒకసెట్ నామినేషన్ వేశారు. దీంతో ఇ ప్పటివరకు నామినేషన్లు వేసిన వారి సంఖ్య ఏడుకు చేరింది. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో రాలేకపోయారు. దీంతో సాదాసీదాగానే నామినేషన్ వేశారు. మరోసారి అగ్రనేతల సమక్షంలో భారీ ర్యాలీలతో మరోసెట్ నామినేషన్కు సిద్ధమవుతున్నారు. కొందరు అభ్యర్థులను ‘సాక్షి’ పలుకరించగా.. ప్రాజెక్టులు తీసుకొస్తా మా తాత అడుగుజాడల్లో ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలే దు. నేను, మా నాన్న సక్సెస్ఫుల్ వ్యాపారులం. ఆ అనుభవంతో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. – గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడే పుట్టిన ఇక్కడే పుట్టి, పెరిగిన. గెలిచినా ఓడినా ప్రజల మధ్యే ఉంటా. ఇక్కడే చస్తా. సింగరేణిలో 26ఏళ్లు కార్మికుడిగా పనిచేసిన. ఎక్కడి నుంచో వచ్చేవారిని కాకుండా ఉద్యమాల నుంచి వచ్చిన నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా. మాయమాటల కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. – కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ అభ్యర్థి అగ్రనేతల ఆధ్వర్యంలో మరో సెట్ వేయనున్న అభ్యర్థులు ఇప్పటివరకు ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ దాఖలు -
అభ్యర్థిని మార్చుతారా?
● ‘కమలం’ పార్టీలో విస్తృతంగా చర్చ ● 24న నామినేషన్ వేస్తానంటున్న ‘గోమాసే’సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పెద్దపల్లి లోక్సభ బీజేపీ అభ్యర్థి మార్పు అంటూ జరుగుతున్న ప్రచారం ఆ పార్టీలో గందరగోళం రేపుతోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి చేరిన గోమాసే శ్రీనివాస్కు బీజేపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. తాజాగా అభ్యర్థిని మారుస్తారని అటు కేడర్లోనూ ఇటు ప్రజల్లో చర్చకు రావడంతో మార్పు ఉంటుందా..? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గోమాసే శ్రీనివాస్ పెద్దపల్లి పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసేందుకు పార్టీ బీఫాం తనకే అనే నమ్మకంతోనే ప్రచారం చేస్తున్నారు. అంతేకాక నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నెల 24న భారీ ఏర్పాట్లతో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో అభ్యర్థి మార్పు అనే ప్రచారం ‘గోమాసే’ అనుచర వర్గాలను కలవరపెడుతోంది. రెండు రోజుల క్రితం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన బీజేపీ నేతలు హైదరాబాద్కు వెళ్లి రాష్ట్ర పెద్దలను కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. జిల్లాలో రెండు వర్గాలు ఉండడంతో కొందరు ‘గోమాసే’నే కొనసాగించాలని కోరినట్లు సమాచారం. ఈ సమయంలో అభ్యర్థిని మార్చితే ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు తెలుస్తోంది. అయితే ‘గోమాసే’ అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కొందరు ఇదే అవకాశంగా మార్చాలని పట్టుబడుతున్నట్లుగా పార్టీ నాయకులే చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం ప్రత్యర్థులే ఈ అనవసర ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. వెంకటేనేశ్ నేత ప్రయత్నాలు పెద్దపల్లి తాజామాజీ ఎంపీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొర్లకుంట వెంకటేశ్ నేత బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన ఇప్పటి వరకు ఎటువంటి అధికార ప్రకటన లేదు. అయినప్పటికీ ఆయన సన్నిహితులు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరితే టికెట్ ఇస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుత అభ్యర్థిని మార్చితే తమకు కూడా అవకాశం కల్పించాలని జిల్లా నుంచి ఆశావహులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారితోపాటు ప్రజాదరణ, పార్టీలో కలుపుకుపోయే వారికి అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ‘కమలం’ పార్టీలో అభ్యర్థి మార్పు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు అధిష్టానం, ఇటు జిల్లా నాయకత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో చివరకు బీఫాం ఎవరి చేతిదక్కుతుందో వేచి చూడాల్సి ఉంది. -
● ఎండలు పెరగడంతో ఎండుతున్న వాగులు, కుంటలు ● అడవిలో దాహార్తి తీర్చేందుకు నీటి వనరులు ఏర్పాటు ● జన్నారం డివిజన్లో 42చోట్ల సాసర్వెల్లు
మరో రెండు నెలలుఏప్రిల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండనున్నందున నీటి సమస్య రాకుండా అధికారులు దృష్టి సారిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తడంతో సీసీ సాసర్వెల్లు ఏర్పాటు చేసి నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మరో రెండు నెలల వరకు ఇదే సమస్య ఉంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలోకి పశువులు వెళ్లకుండా కట్టడి చేయడం వల్ల సాసర్వెల్లో నీరు వన్యప్రాణులు స్వేచ్ఛగా తాగుతున్నాయని తెలిపారు. వర్షాలు కురిసే వరకు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. పర్యవేక్షణ చేస్తాంఏప్రిల్, మే రెండు మాసాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే నీటికుంటలు, సోలార్ పంపులు, ర్యాంపువెల్ల ద్వారా నీటిని అందిస్తున్నాం. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాసర్వెల్ ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని పోయిస్తున్నాం. శబ్దానికి వన్యప్రాణులు బెదిరిపోయే అవకాశం ఉన్నందున ఎక్కువగా సాసర్వెల్ లేకుండా చూస్తున్నాం. అవసరమైతేనే ఏర్పాటు చేస్తున్నాం. నీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. – హఫీజొద్దీన్, రేంజ్ అధికారిజన్నారం: ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతుండడంతో మనుషులతోపాటు పశుపక్ష్యాదులు అల్లాడిపోతున్నాయి. వాగులు, వంకలు, ఊట కుంట లు, చెలిమెలు, చెక్డ్యాంలు ఎండిపోతున్నాయి. దీంతో కవ్వాల్ టైగర్జోన్లో వన్యప్రాణులకు తాగునీటి ఏర్పడకుండా అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. అడవిలో నీరు లభించకపోతే జంతువులు దాహం తీర్చుకునేందుకు పంట పొలాలు, జనా వాసాల వైపు పరుగులు తీస్తూ ప్రాణాల మీదకు తె చ్చుకునే ప్రమాదం ఉంది. దీంతో అటవీ శాఖ అ ధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర తీ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత ఉంటుంది. కానీ ఈ ఏడాది మార్చి నుంచే ఎండల తీవ్రత పెరిగినందున అడవిలోని నీటికుంటలు, చెలిమెలు, కుంటలు ఎండుతున్నాయి. దీనికి తోడు కడెం ప్రధాన కాలువ నుంచి నీరు విడుదల చేయకపోవడం వల్ల ఊటలు లేక ఇబ్బంది ఏర్పడుతోంది. జంతువుల ఆవాసాల్లోనే.. కవ్వాల్ టైగర్జోన్లో 893 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1123 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏ రియా ఉంది. కోర్ ఏరియాలో వన్యప్రాణులు ఆవా సాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో చిరుతపులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు, చు క్కల దుప్పులు, సాంబార్లు, నీలుగాయిలు, అడవి పందులు, కొండగొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు ఉ న్నాయి. అత్యధికంగా చుక్కల దుప్పులు, అడవి పందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంతో పోలిస్తే వన్యప్రాణుల సంఖ్య రెట్టింపు అయిన ట్లు అధికారులు చెబుతున్నారు. జంతువులు సాధారణంగా ఆ హార అన్వేషణ కోసం నాలుగు కిలోమీటర్ల పరిధిలో తిరుగుతాయి. వీటికి సరిపడా నీటి వనరులున్నా ఎండల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం నీటికుంటలు, చెలిమెలు, వాగులు ఎండిపోతున్నాయి. జంతువుల ఆవాసాల్లోనే నీటి ఎద్దడి రాకుండా అధి కారులు చొరవ తీసుకుంటున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలో నీటి వనరు జన్నారం డివిజన్లో ప్రతీ రెండు కిలోమీటర్ల దూ రంలో ఒక నీటి వనరు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు కిలోమీటర్ల దూరంలో సో లార్పంపు లేదా ర్యాంపు వెల్ లేదా నీటికుంట ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆ రెండు కిలోమీటర్ల దూ రంలో నీటివనరు లేని ప్రాంతంలో సాసర్వెల్లు ఏర్పాటు చేశారు. జన్నారం అటవీ డివిజన్లో 40 బీట్లలో 42 చోట్ల సాసర్వెల్లు ఏర్పాటు చేసి గ్రా మ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీరు పోయిస్తున్నారు. బేస్క్యాంపు సిబ్బంది, బీట్గార్డులు పర్యవేక్షిస్తూ నీరు అయిపోగానే నింపుతున్నారు.సాసర్వెల్లో నీరుజన్నారం అటవీ డివిజన్లో 40 అటవీ బీట్లు ఉన్నాయి. వీటి పరిధిలో నీటికుంటలు సోలార్పంపులతో నింపుతున్నారు. ఎండల తీవ్రతకు కుంటల్లో నీరు ఇంకిపోతుండడం, సోలార్ పంపుల మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉండడం వల్ల అధికారులు సాసర్వెల్లలో నీటిని నింపే ఏర్పాట్లు చేస్తున్నారు. సహజసిద్ధంగా సోలార్పంపులు, ర్యాంపువెల్లు, చెలిమెలు, వాగుల ద్వారా నీరందించాలని అటవీ అధికారులు ప్రయత్నించినా ఎండల తీవ్రతతో సఫలం కాలేకపోతున్నారు. -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం?
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లాగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వ భూమి కొరత ఏర్పడింది. మరోవైపు ఉన్న కాస్త సర్కారు భూమి కబ్జాకు గురవుతోంది. మంచిర్యాలలో డంపింగ్యార్డు, ప్రభుత్వ భవనాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థల భవన నిర్మాణాలకు భూమి లేక పక్క మండలాల్లో నిర్మించాల్సి వస్తోంది. ఎన్నికల వేళ అధికారులు బిజీగా ఉండడంతో అక్కడక్కడ మిగిలి ఉన్న కొంత ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. మంచిర్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డు రంగంపేట్ ఆండాళమ్మ కాలనీలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు కొందరు ఇటీవల ప్రయత్నాలు మొదలు పెట్టారు. డంపింగ్ యార్డు సమీపంలో ఉన్న మిషన్ భగీరథ నీటి ట్యాంకును నిర్మించిన చోటు సమీపంలో ఎకరానికి పైగా ప్రభుత్వ భూమిని చదును చేశారు. స్థానికుల అభ్యంతరంతో ప్రస్తుతం కార్యకలాపాలు నిలిచినా.. తెరవెనుక దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెనుక భాగంలోనూ ఉన్న ప్రభుత్వ భూమిలో షెడ్లు వేసుకునేందుకు ఇటీవల కొందరు ప్రయత్నించారు. ఆండాళమ్మ కాలనీలో ఇళ్ల కోసం కేటాయించిన భూమి కాకుండా మిగిలిన ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. విలువైన భూమి కావడంతోనే.. మంచిర్యాల మున్సిపాలిటీలోని రంగంపేట్, ఆండాళమ్మ కాలనీలోని సర్వే నంబర్ 131లో 38.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలోనే ప్రభుత్వం 20 ఎకరాల్లో ఆండాళమ్మ కాలనీ ఏర్పాటు చేసి పేదలకు ప్లాట్లుగా అప్పగించింది. 5 ఎకరాల భూ మి దర్గా కోసం, 8 గుంటలను ఏసీసీ పైపులైన్కు, మరో 2 గుంటలు ముస్లింల చిల్లా నిర్మాణానికి అ ప్పగించారు. 1.25 ఎకరాలు, 25 గుంటల భూమి పేదలకు అసైన్ చేశారు. మిగిలిన భూమి కబ్జాకు కొన్నేళ్లుగా పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆండాళమ్మ కాలనీ గుడి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు కొందరు ప్రయత్నించగా కాలనీవాసులు కలెక్టర్కు 2021లోనే ఫిర్యాదు చేశారు. దీంతో రెవె న్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వ భూమిగా తే ల్చగా, కాలనీవాసులకు, కబ్జాలో ఉన్న వారికి మ ధ్య కొన్నాళ్లుగా వివాదం జరుగుతోంది. కొందరు కాలనీకి చెందిన వారిని మచ్చిక చేసుకున్న తరువాతనే ప్రభుత్వ భూమిలో ఇటీవల ప్రహరీ నిర్మించినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 8వ వా ర్డులోనే పాతమంచిర్యాల సాయిబాబ గుడిని ఆనుకుని ఉన్న రహదారి కోసం కేటాయించిన భూమి కబ్జాకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా రు. దీనిని ఆనుకుని ఉన్న పలు వెంచర్ల యజమానులు 40 అడుగుల వెడల్పు బాటను కొద్దికొద్దిగా కబ్జా చేసి, వారి వెంచర్లలో కలుపుకునే యత్నాలు చేస్తున్నారు. పాతమంచి ర్యాల, ఆండాళమ్మ కాలనీలో ప్రస్తు తం కబ్జాకు ప్రయత్నించే భూముల విలువ దాదాపు రూ.5 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని రక్షించేలా రెవెన్యూ అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మంచిర్యాల తహసీల్దార్ రమేశ్ను సంప్రదించగా.. 131 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిని పరిశీలించి, అక్రమంగా ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. భూమిని చదును చేసిన వైనం దారినీ వదలని రియల్ వ్యాపారులు
Related News by category
-
ముగిసిన ఐదో తరగతి వార్షిక పరీక్షలు
బెల్లంపల్లి: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలు శుక్రవారం ముగిశాయి. బెల్లంపల్లిలోని సంక్షేమ బాలుర గురుకుల విద్యాల యం, సంక్షేమ బాలికల గురుకుల విద్యాల యం, కాసిపేట సంక్షేమ బాలుర గురుకుల వి ద్యాయాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష ముగిసే సమయానికి చేరుకున్నారు. సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ప్ర త్యేక సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఇళ్ల వద్ద పిల్ల లు కాలక్షేపం చేస్తూనే సెల్ఫోన్లకు ఆకర్శితులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. తర్వాత ఆటోలు, టాటా ఏస్ వాహనాలు, కార్లలో విద్యార్థుల వస్తు సామగ్రి, ట్రంక్ పెట్టెలతో ఇంటిబాట పట్టారు. -
అభ్యర్థిని మార్చుతారా?
● ‘కమలం’ పార్టీలో విస్తృతంగా చర్చ ● 24న నామినేషన్ వేస్తానంటున్న ‘గోమాసే’సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పెద్దపల్లి లోక్సభ బీజేపీ అభ్యర్థి మార్పు అంటూ జరుగుతున్న ప్రచారం ఆ పార్టీలో గందరగోళం రేపుతోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి చేరిన గోమాసే శ్రీనివాస్కు బీజేపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. తాజాగా అభ్యర్థిని మారుస్తారని అటు కేడర్లోనూ ఇటు ప్రజల్లో చర్చకు రావడంతో మార్పు ఉంటుందా..? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గోమాసే శ్రీనివాస్ పెద్దపల్లి పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసేందుకు పార్టీ బీఫాం తనకే అనే నమ్మకంతోనే ప్రచారం చేస్తున్నారు. అంతేకాక నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నెల 24న భారీ ఏర్పాట్లతో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో అభ్యర్థి మార్పు అనే ప్రచారం ‘గోమాసే’ అనుచర వర్గాలను కలవరపెడుతోంది. రెండు రోజుల క్రితం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన బీజేపీ నేతలు హైదరాబాద్కు వెళ్లి రాష్ట్ర పెద్దలను కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. జిల్లాలో రెండు వర్గాలు ఉండడంతో కొందరు ‘గోమాసే’నే కొనసాగించాలని కోరినట్లు సమాచారం. ఈ సమయంలో అభ్యర్థిని మార్చితే ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు తెలుస్తోంది. అయితే ‘గోమాసే’ అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కొందరు ఇదే అవకాశంగా మార్చాలని పట్టుబడుతున్నట్లుగా పార్టీ నాయకులే చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం ప్రత్యర్థులే ఈ అనవసర ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. వెంకటేనేశ్ నేత ప్రయత్నాలు పెద్దపల్లి తాజామాజీ ఎంపీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొర్లకుంట వెంకటేశ్ నేత బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన ఇప్పటి వరకు ఎటువంటి అధికార ప్రకటన లేదు. అయినప్పటికీ ఆయన సన్నిహితులు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరితే టికెట్ ఇస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుత అభ్యర్థిని మార్చితే తమకు కూడా అవకాశం కల్పించాలని జిల్లా నుంచి ఆశావహులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారితోపాటు ప్రజాదరణ, పార్టీలో కలుపుకుపోయే వారికి అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ‘కమలం’ పార్టీలో అభ్యర్థి మార్పు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు అధిష్టానం, ఇటు జిల్లా నాయకత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో చివరకు బీఫాం ఎవరి చేతిదక్కుతుందో వేచి చూడాల్సి ఉంది. -
● ఎండలు పెరగడంతో ఎండుతున్న వాగులు, కుంటలు ● అడవిలో దాహార్తి తీర్చేందుకు నీటి వనరులు ఏర్పాటు ● జన్నారం డివిజన్లో 42చోట్ల సాసర్వెల్లు
మరో రెండు నెలలుఏప్రిల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండనున్నందున నీటి సమస్య రాకుండా అధికారులు దృష్టి సారిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తడంతో సీసీ సాసర్వెల్లు ఏర్పాటు చేసి నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మరో రెండు నెలల వరకు ఇదే సమస్య ఉంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలోకి పశువులు వెళ్లకుండా కట్టడి చేయడం వల్ల సాసర్వెల్లో నీరు వన్యప్రాణులు స్వేచ్ఛగా తాగుతున్నాయని తెలిపారు. వర్షాలు కురిసే వరకు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. పర్యవేక్షణ చేస్తాంఏప్రిల్, మే రెండు మాసాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే నీటికుంటలు, సోలార్ పంపులు, ర్యాంపువెల్ల ద్వారా నీటిని అందిస్తున్నాం. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాసర్వెల్ ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని పోయిస్తున్నాం. శబ్దానికి వన్యప్రాణులు బెదిరిపోయే అవకాశం ఉన్నందున ఎక్కువగా సాసర్వెల్ లేకుండా చూస్తున్నాం. అవసరమైతేనే ఏర్పాటు చేస్తున్నాం. నీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. – హఫీజొద్దీన్, రేంజ్ అధికారిజన్నారం: ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతుండడంతో మనుషులతోపాటు పశుపక్ష్యాదులు అల్లాడిపోతున్నాయి. వాగులు, వంకలు, ఊట కుంట లు, చెలిమెలు, చెక్డ్యాంలు ఎండిపోతున్నాయి. దీంతో కవ్వాల్ టైగర్జోన్లో వన్యప్రాణులకు తాగునీటి ఏర్పడకుండా అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. అడవిలో నీరు లభించకపోతే జంతువులు దాహం తీర్చుకునేందుకు పంట పొలాలు, జనా వాసాల వైపు పరుగులు తీస్తూ ప్రాణాల మీదకు తె చ్చుకునే ప్రమాదం ఉంది. దీంతో అటవీ శాఖ అ ధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర తీ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత ఉంటుంది. కానీ ఈ ఏడాది మార్చి నుంచే ఎండల తీవ్రత పెరిగినందున అడవిలోని నీటికుంటలు, చెలిమెలు, కుంటలు ఎండుతున్నాయి. దీనికి తోడు కడెం ప్రధాన కాలువ నుంచి నీరు విడుదల చేయకపోవడం వల్ల ఊటలు లేక ఇబ్బంది ఏర్పడుతోంది. జంతువుల ఆవాసాల్లోనే.. కవ్వాల్ టైగర్జోన్లో 893 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1123 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏ రియా ఉంది. కోర్ ఏరియాలో వన్యప్రాణులు ఆవా సాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో చిరుతపులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు, చు క్కల దుప్పులు, సాంబార్లు, నీలుగాయిలు, అడవి పందులు, కొండగొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు ఉ న్నాయి. అత్యధికంగా చుక్కల దుప్పులు, అడవి పందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంతో పోలిస్తే వన్యప్రాణుల సంఖ్య రెట్టింపు అయిన ట్లు అధికారులు చెబుతున్నారు. జంతువులు సాధారణంగా ఆ హార అన్వేషణ కోసం నాలుగు కిలోమీటర్ల పరిధిలో తిరుగుతాయి. వీటికి సరిపడా నీటి వనరులున్నా ఎండల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం నీటికుంటలు, చెలిమెలు, వాగులు ఎండిపోతున్నాయి. జంతువుల ఆవాసాల్లోనే నీటి ఎద్దడి రాకుండా అధి కారులు చొరవ తీసుకుంటున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలో నీటి వనరు జన్నారం డివిజన్లో ప్రతీ రెండు కిలోమీటర్ల దూ రంలో ఒక నీటి వనరు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు కిలోమీటర్ల దూరంలో సో లార్పంపు లేదా ర్యాంపు వెల్ లేదా నీటికుంట ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆ రెండు కిలోమీటర్ల దూ రంలో నీటివనరు లేని ప్రాంతంలో సాసర్వెల్లు ఏర్పాటు చేశారు. జన్నారం అటవీ డివిజన్లో 40 బీట్లలో 42 చోట్ల సాసర్వెల్లు ఏర్పాటు చేసి గ్రా మ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీరు పోయిస్తున్నారు. బేస్క్యాంపు సిబ్బంది, బీట్గార్డులు పర్యవేక్షిస్తూ నీరు అయిపోగానే నింపుతున్నారు.సాసర్వెల్లో నీరుజన్నారం అటవీ డివిజన్లో 40 అటవీ బీట్లు ఉన్నాయి. వీటి పరిధిలో నీటికుంటలు సోలార్పంపులతో నింపుతున్నారు. ఎండల తీవ్రతకు కుంటల్లో నీరు ఇంకిపోతుండడం, సోలార్ పంపుల మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉండడం వల్ల అధికారులు సాసర్వెల్లలో నీటిని నింపే ఏర్పాట్లు చేస్తున్నారు. సహజసిద్ధంగా సోలార్పంపులు, ర్యాంపువెల్లు, చెలిమెలు, వాగుల ద్వారా నీరందించాలని అటవీ అధికారులు ప్రయత్నించినా ఎండల తీవ్రతతో సఫలం కాలేకపోతున్నారు. -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం?
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లాగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వ భూమి కొరత ఏర్పడింది. మరోవైపు ఉన్న కాస్త సర్కారు భూమి కబ్జాకు గురవుతోంది. మంచిర్యాలలో డంపింగ్యార్డు, ప్రభుత్వ భవనాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థల భవన నిర్మాణాలకు భూమి లేక పక్క మండలాల్లో నిర్మించాల్సి వస్తోంది. ఎన్నికల వేళ అధికారులు బిజీగా ఉండడంతో అక్కడక్కడ మిగిలి ఉన్న కొంత ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. మంచిర్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డు రంగంపేట్ ఆండాళమ్మ కాలనీలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు కొందరు ఇటీవల ప్రయత్నాలు మొదలు పెట్టారు. డంపింగ్ యార్డు సమీపంలో ఉన్న మిషన్ భగీరథ నీటి ట్యాంకును నిర్మించిన చోటు సమీపంలో ఎకరానికి పైగా ప్రభుత్వ భూమిని చదును చేశారు. స్థానికుల అభ్యంతరంతో ప్రస్తుతం కార్యకలాపాలు నిలిచినా.. తెరవెనుక దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెనుక భాగంలోనూ ఉన్న ప్రభుత్వ భూమిలో షెడ్లు వేసుకునేందుకు ఇటీవల కొందరు ప్రయత్నించారు. ఆండాళమ్మ కాలనీలో ఇళ్ల కోసం కేటాయించిన భూమి కాకుండా మిగిలిన ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. విలువైన భూమి కావడంతోనే.. మంచిర్యాల మున్సిపాలిటీలోని రంగంపేట్, ఆండాళమ్మ కాలనీలోని సర్వే నంబర్ 131లో 38.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలోనే ప్రభుత్వం 20 ఎకరాల్లో ఆండాళమ్మ కాలనీ ఏర్పాటు చేసి పేదలకు ప్లాట్లుగా అప్పగించింది. 5 ఎకరాల భూ మి దర్గా కోసం, 8 గుంటలను ఏసీసీ పైపులైన్కు, మరో 2 గుంటలు ముస్లింల చిల్లా నిర్మాణానికి అ ప్పగించారు. 1.25 ఎకరాలు, 25 గుంటల భూమి పేదలకు అసైన్ చేశారు. మిగిలిన భూమి కబ్జాకు కొన్నేళ్లుగా పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆండాళమ్మ కాలనీ గుడి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు కొందరు ప్రయత్నించగా కాలనీవాసులు కలెక్టర్కు 2021లోనే ఫిర్యాదు చేశారు. దీంతో రెవె న్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వ భూమిగా తే ల్చగా, కాలనీవాసులకు, కబ్జాలో ఉన్న వారికి మ ధ్య కొన్నాళ్లుగా వివాదం జరుగుతోంది. కొందరు కాలనీకి చెందిన వారిని మచ్చిక చేసుకున్న తరువాతనే ప్రభుత్వ భూమిలో ఇటీవల ప్రహరీ నిర్మించినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 8వ వా ర్డులోనే పాతమంచిర్యాల సాయిబాబ గుడిని ఆనుకుని ఉన్న రహదారి కోసం కేటాయించిన భూమి కబ్జాకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా రు. దీనిని ఆనుకుని ఉన్న పలు వెంచర్ల యజమానులు 40 అడుగుల వెడల్పు బాటను కొద్దికొద్దిగా కబ్జా చేసి, వారి వెంచర్లలో కలుపుకునే యత్నాలు చేస్తున్నారు. పాతమంచి ర్యాల, ఆండాళమ్మ కాలనీలో ప్రస్తు తం కబ్జాకు ప్రయత్నించే భూముల విలువ దాదాపు రూ.5 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని రక్షించేలా రెవెన్యూ అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మంచిర్యాల తహసీల్దార్ రమేశ్ను సంప్రదించగా.. 131 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిని పరిశీలించి, అక్రమంగా ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. భూమిని చదును చేసిన వైనం దారినీ వదలని రియల్ వ్యాపారులు -
సాదాసీదాగా ‘కొప్పుల’, వంశీ నామినేషన్
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి ఎంపీ స్థానానికి రెండోరోజు ముగ్గురు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్లో రిట ర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. శుక్రవారం ఏకాదశి మంచిరోజు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కో రుకంటి చందర్తో కలిసి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, నే తకాని సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం నరేశ్తో కలి సి నామినేషన్ వేశారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి మరో సెట్ అందజేశారు. వీరుకా కుండా బీఆర్ఎస్ తరఫున డమ్మీ అభ్యర్థిగా కొంకటి లింగమూర్తి ఒకసెట్ నామినేషన్ వేశారు. దీంతో ఇ ప్పటివరకు నామినేషన్లు వేసిన వారి సంఖ్య ఏడుకు చేరింది. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో రాలేకపోయారు. దీంతో సాదాసీదాగానే నామినేషన్ వేశారు. మరోసారి అగ్రనేతల సమక్షంలో భారీ ర్యాలీలతో మరోసెట్ నామినేషన్కు సిద్ధమవుతున్నారు. కొందరు అభ్యర్థులను ‘సాక్షి’ పలుకరించగా.. ప్రాజెక్టులు తీసుకొస్తా మా తాత అడుగుజాడల్లో ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలే దు. నేను, మా నాన్న సక్సెస్ఫుల్ వ్యాపారులం. ఆ అనుభవంతో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. – గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడే పుట్టిన ఇక్కడే పుట్టి, పెరిగిన. గెలిచినా ఓడినా ప్రజల మధ్యే ఉంటా. ఇక్కడే చస్తా. సింగరేణిలో 26ఏళ్లు కార్మికుడిగా పనిచేసిన. ఎక్కడి నుంచో వచ్చేవారిని కాకుండా ఉద్యమాల నుంచి వచ్చిన నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా. మాయమాటల కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. – కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ అభ్యర్థి అగ్రనేతల ఆధ్వర్యంలో మరో సెట్ వేయనున్న అభ్యర్థులు ఇప్పటివరకు ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ దాఖలు
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
'కల్కి' కాపీ సినిమా కాదు.. క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement