Sakshi News home page

బిల్లు రాలేదని స్కూల్‌ గేటుకు తాళం

Published Tue, Apr 16 2024 12:00 AM

గేటుకు తాళం వేయడంతో స్కూల్‌ బయట విద్యార్థులు
 - Sakshi

కాగజ్‌నగర్‌రూరల్‌: పాఠశాల భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదని కాగజ్‌నగర్‌ పట్టణంలోని పెట్రోల్‌ పంపు జెడ్పీ ఉన్నత పాఠశాల గేటుకు సోమవారం సంబంధిత కాంట్రాక్టర్‌ తాళం వేశాడు. మన ఊరు– మన బడి పథకం కింద రూ.97 లక్షలతో కాంట్రాక్టర్‌ హబీబ్‌ పాఠశాల భవనం నిర్మించారు. పనులు పూర్తయి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు బిల్లులు మంజూరు కాలేదు. విసిగిపోయిన కాంట్రాక్టర్‌ సోమవారం ఉదయం స్కూల్‌ గేటుకు తాళం వేశాడు. సోమవారం నుంచే విద్యార్థులకు ఎస్‌ఏ– 2 పరీక్షలు ప్రారంభం కావడంతో సుమారు గంట సేపు పాఠశాల వద్దే పడిగాపులు కాశారు. విషయం తెలుసుకున్న అధికారులు మూడు రోజుల్లో బిల్లులు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్‌ గేటు తాళం తీశాడు.

Advertisement
Advertisement