సగం చెల్లించి మిగతావి పెండింగ్‌ | Sakshi
Sakshi News home page

సగం చెల్లించి మిగతావి పెండింగ్‌

Published Sat, Nov 11 2023 11:58 PM

-

పార్టీ మారుతున్న వారిపై అనుమానంతో స గం చెల్లించి మిగతా సగం తర్వాత అన్నట్లుగా నాయకులు వ్యవహారం సాగిస్తున్నారు. అడిగిన మొత్తాన్ని అందిస్తే మళ్లీ తోక జాడిస్తే ఎలా అనే కోణంలో ముందు జాగ్రత్తగా తన గుప్పిట ఉంచుకునేలా సగం పెండింగ్‌లో ఉంచుతున్నారు. ఇక కొందరికి ఏకంగా పోస్టు డేటెడ్‌ చెక్‌లు ఇస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదే అదునుగా కొందరు నాయకులు ఎంత గుంజాలో అంత గుంజుతూ పార్టీలు మారుతున్నారు. బహిరంగ సభల ముందు ఎక్కువగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్య నాయకుల చేరిక వెనుక ఖరీదైన మంత్రాంగం నడుస్తున్నాయి. ఎమ్మెల్యేగా పోటీకి దిగా లనుకున్న నాయకులు సైతం చివరకు ఏదో ఓ హామీతో చల్ల బడుతూ వెనక్కి తగ్గుతున్నారు.

Advertisement
Advertisement