మహబూబ్నగర్ న్యూటౌన్: జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్ అర్బన్ మండలంలో పనిచేస్తున్న నాగార్జున, భూత్పూర్ తహసీల్దార్ భానుకిరణ్లను సంగారెడ్డి జిల్లాకు, జడ్చర్ల తహసీల్దార్ శ్రీనివాస్ను నల్లగొండ జిల్లాకు బదిలీ చేశారు. సుదీర్ఘకాలంగా జిల్లాలో పనిచేస్తున్నందున ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీ చేశారు. కాగా ముగ్గురు తహసీల్దార్లను బదిలీ చేసిన సీసీఎల్ఏ మరో ముగ్గురు తహసీల్దార్లను జిల్లాకు కేటాయించింది. వీరిలో జోగుళాంబ గద్వాల నుంచి రాధాకృష్ణ, పులిరాజు, వనపర్తి జిల్లా నుంచి సత్యనారాయణరెడ్డి వచ్చారు. కలెక్టర్ వీరికి పోస్టింగులు శుక్రవారం కేటాయించే అవకాశం ఉంది.
ఎన్నికలఖర్చు వివరాల ఆరా
మహబూబ్నగర్ న్యూటౌన్: మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన రోజువారి ఎన్నికల ఖర్చు వివరాలను మహబూబ్నగర్ అసెంబ్లీ పరిశీలకులు కుందన్యాదవ్ గురువారం ఆర్అండ్బీ అతిథి గృహంలో పరిశీలించారు. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఇప్పటి వరకు రోజువారి చేసిన ఖర్చులకు సంబంధించిన లెక్కల వివరాల గురించి తెలుసుకున్నారు. అభ్యర్థుల ఏజెంట్లకు ఖర్చుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment