జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్) / దేవరకద్ర: జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు గాను నామినేషన్ల దాఖలు ఊపందుకుంది. ఈ నెల 3 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగా.. శుక్రవారం వరకు గడువు ఉంది. ఈ క్రమంలో బుధవారం మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానానికి గాను 5 నామినేషన్లు వచ్చాయి. మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పార్టీ నాయకులు అమర్, కౌన్సిలర్లు ఆనంద్గౌడ్, లక్ష్మణ్యాదవ్, రాఘవేందర్రాజు, అనితలతో కలిసి వచ్చి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి అనిల్కుమార్కు అందజేశారు. అలాగే బీజేపీ అభ్యర్థిగా మిథున్రెడ్డి నామినేషన్ వేశారు. ఆయన వెంట కేంద్ర మంత్రి వీకే సింగ్, మిథున్రెడ్డి తల్లిదండ్రులు మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, రాజేశ్వరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మ చారి వచ్చారు. అలాగే బీఎస్పీ అభ్యర్థిగా స్వప్న, స్వతంత్రులుగా శ్రీనివాసులు, మల్కాపురం శ్రీనివాస్గౌడ్ నామినేషన్లు వేశారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి శ్రీనివాస్గౌడ్ గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
● దేవరకద్ర అసెంబ్లీ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జి.మధుసూదన్రెడ్డి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నటరాజ్కు అందజేశారు.
జిల్లావ్యాప్తంగా తొమ్మిది మంది దాఖలు