కర్నూలు : ఆన్లైన్లో పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతుందని నమ్మించి మోసానికి పాల్పడిన కర్నూలు మండలం మునగాలపాడు గ్రామానికి చెందిన నవీన్ కుమార్, అతని తమ్ముడు అరుణ్ కుమార్, బావమరిది మహేష్లను కర్నూలు సీఐడీ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. ఈ సందర్భంగా బుధవారం రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కర్నూలు సీఐడీ రీజనల్ ఆఫీస్ సైబర్ క్రైం అనాలసిస్ టాస్క్ఫోర్ టీమ్ సీఐ ఎస్.నగేష్ బాబు వివరాలను వెల్లడించారు. కర్నూలుకు చెందిన జంగం వీరలక్ష్మిని స్నేహితురాలు మాధురి ద్వారా నవీన్ కుమార్ పరిచయం చేసుకున్నారు. ఆన్లైన్లో ఎస్ఏ ట్రేడింగ్ కంపెనీలో మినిమమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే నెల రోజుల వరకు రోజూ కొంత మొత్తం ఆమె అకౌంట్కు జమ అవుతుందని మాయమాటలు చెప్పాడు. వీరలక్ష్మి సెల్ఫోన్కు లింక్ పంపి విడతల వారీగా రూ.4.87 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. ఆన్లైన్లో డబ్బులు వేసిన తర్వాత లింక్కు సంబంధించిన సైట్ ఓపెన్ కాకపోవడంతో వరలక్ష్మి.. నవీన్ కుమార్ను ఫోన్లో సంప్రదించగా త్వరలో ఓపెన్ అవుతుందని మాయమాటలు చెప్పి మోసం చేశాడు. ఆ తర్వాత అతని సెల్ఫోన్ కూడా పనిచేయకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి రెండవ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం అనాలసిస్ టాస్క్ఫోర్స్ టీమ్ రంగంలోకి దిగి కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు నగేష్ బాబు తెలిపారు. జిల్లాలో సుమారు 143 ఆన్లైన్ ఫిర్యాదులలో వీరు నేరస్థులుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. నవీన్ కుమార్ కర్నూలులో నివాసముంటూ ఆన్లైన్లో ఎస్ఏ ట్రేడింగ్ కంపెనీ గురించి వివరిస్తూ బెంగుళూరులో కంపెనీ ఉందని, మేనేజింగ్ డైరెక్టర్గా రమణ నాగ్పాల్ ఉన్నారని నమ్మించేవారన్నారు. ఆన్లైన్లో జనరేట్ అయ్యే ఒక లింక్ ద్వారా అకౌంట్ను ఓపెన్ చేసుకుని అందులో పెట్టుబడి పెడితే నెల రోజుల తర్వాత నుంచి రోజుకు కొంత మొత్తం అకౌంట్కు జమ అవుతుందని మోసం చేశారన్నారు. అమాయక ప్రజలు చాలామంది అతని మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. ఆన్లైన్ బిజినెస్, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్, ఆన్లైన్ లింక్ బిజినెస్ తదితర పేర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలా మోసపోతే తక్షణమే సైబర్ హెల్ప్లైన్ నెంబర్ 1930కి (టోల్ఫ్రీ) లేదా ఠీఠీఠీ. ఛిడఛ్ఛటఛిటజీఝ్ఛ. gov. in కు ఫిర్యాదు చేయాలని లేదా దగ్గర్లోని పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిందితులు ముగ్గురినీ కోర్టులో హాజరుపర్చగా వచ్చే నెల 8వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. ఎస్ఐ బందే సాహెబ్, టాస్క్ఫోర్స్ సిబ్బంది ప్రవీణ్, బోస్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్టు
Published Thu, Mar 28 2024 1:25 AM
Related news
-
మంచి పాలనకే ‘తొలి’ ఓటు!
● నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటాం ● ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగం ● పాలకులు మంచి వారైతే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది ● తొలిసారిగా ఓటు వేయబోతున్న యువత మనోగతం కర్నూలు(అగ్రికల్చర్): మంచి పాలన అందించే వారికే తాము ఓటు వేస్తామని తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువతీ, యువకులు చెబుతున్నారు. పాలకులు మంచి వారైతే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి వారినే తాము ఎన్నుకుంటామని పేర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో 20.14 లక్షలు, నంద్యాల జిల్లాలో 13.94 లక్షలు.. మొత్తం 34.08 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18, 19 ఏళ్ల యువత 1,71,215 మంది ఉన్నారు. అయితే ఇందులో 87,285 మంది ఓటర్లుగా నమోదయ్యారు. మే నెల 13న నిర్వహించే శాసనసభ, లోకసభ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 49,741, నంద్యాల జిల్లాలో 37,844 మంది మొద టి సారిగా ఓటు వేయనున్నారు. ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని వీరు స్పష్టం చేస్తున్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే వారిని, అభివృద్ధి చేసేవారని గెలిపిస్తామని చెబుతున్నారు. ఈ సారి పెరగనున్న ఓటింగ్ శాతం.. 18–19 ఏళ్ల యువత ఓటర్లుగా నమోదయ్యేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ఎన్నికల కమిషన్ పిలుపు నిస్తోంది. ఇందులో భాగంగా స్వీప్ కార్యక్రమాలను అధికారులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. 2019 వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఓటింగ్కు 50 శాతం వరకు యువత దూరంగా ఉంటోంది. ఈ సారి ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా యువఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. నియోజక వర్గం 18–19 ఏళ్ల యువ ఓటర్లు కర్నూలు 6,425 పాణ్యం 8,250 పత్తికొండ 5,678 కోడుమూరు 5,947 ఎమ్మిగనూరు 6,483 మంత్రాలయం 5,429 ఆలూరు 5,749 శ్రీశైలం 8,349 నంద్యాల 6,709 బనగానపల్లె 6,402 ఆదోని 5,510 ఆళ్లగడ్డ 5,247 డోన్ 5,488 నందికొట్కూరు 5,609 మొత్తం 87,275 -
టీజీ భరత్ జన్మదిన వేడుకకు కోట్లలో ఖర్చు..!
టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తండ్రి, పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేష్కు సంబంధించిన శ్రీరాయలసీమ ఆల్కాలీస్ పరిశ్రమకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి xxxxxx680523 నెంబర్ గల ఖాతాకు మార్చి 8న రూ.1,500 జమ అయ్యింది. టీజీ భరత్ కుటుంబానికి చెందిన గౌరీగోపాల్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి xxx0523నెంబర్ గల ఖాతాకు ఏప్రిల్ 6న రూ.5 వేలు జమ అయ్యింది.. ఈ రెండే కాదు.. ఎన్నికల వేళ కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గుట్టుగా డబ్బు పంపిణీ చేస్తూ కుల సంఘాల నాయకులను, ప్రజలను ప్రలోభపెడుతున్నట్ల తెలుస్తోంది. ఓటమి భయంతో డబ్బును ఎరగా చూపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కులాల వారీగా సంఘాల నాయకులను చేరదీసి కొంతమందికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు ముట్టజెప్పి మద్దతు కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండుసార్లు ఓటమి చెందాం.. సాయం చేయండి.. టీజీ భరత్ తరపున ఆయన తండ్రి టీజీ వెంకటేష్ నగరంలోని ప్రముఖులను పలు రాజకీయ పార్టీల నాయకులు, కులసంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులను పిలిపించి రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు. రెండుసార్లు ఓడిపోయాం.. ఈసారి కూడా ఓడిపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఎలాగైనా సాయం చేయండి.. మీకు ఏ విధమైన సాయం కావాలన్నా చేస్తామంటూ ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. వార్డుల్లో ఒకస్థాయి నాయకుడిని కూడా వదలకుండా తన కార్యాలయానికి పిలిపించుకుని అంతో ఇంతో ముట్టజెప్పి తన కొడుకును గట్టెక్కించాలని ప్రాధేయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో టీజీ వెంకటేష్ దగ్గర కనీసం 70 మందికి పైగా ముఖ్యమైన వ్యక్తులు ఎళ్లవేళలా కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండేవారు. టీజీ భరత్ వ్యవహారశైలి నచ్చక చాలామంది దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా టీజీ వెంకటేష్ పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భరత్తో కలసి పని చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. బర్త్డే గిఫ్ట్ పేరుతో ఓటర్లకు వల 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం. ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించేందుకు భరత్ తన బర్త్డేను వేదికగా చేసుకున్నారు. బర్త్డేకు జనం రారని ముందే ఊహించి తన అనుచరులతో ఇంటింటికీ తిరిగి గిఫ్ట్ కూపన్లు పంపిణీ చేయించారు. ఏస్టీబీసీ కళాశాల మైదానంలో వచ్చి న వారందరికీ విందుతో పాటు రూ.700 విలువ చేసే గిప్ట్లు పంపిణీ చేసి ఎన్నికల్లో సహకరించాలని కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. – కర్నూలు -
స్నేహితులతో కూడా ఓటు వేయిస్తా
ప్రస్తుతం నేను ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాను. ఓటు హక్కును పొందేందుకు దరఖాస్తు చేసుకోవడంతోనే అమోదించి ఓటరుగా నమోదు చేశారు. ఆలూరు నియోజకవర్గంలో నా ఓటు నేను స్వేచ్ఛగా వినియోగించుకుంటాను. పాలకులు మంచివారైతే రాష్ట్రం బాగుపడుతుంది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటువేస్తాను. మొదటి సారిగా ఓటు వేయబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఓటు వేస్తా... నా స్నేహితులతో కూడా ఓటు వేయిస్తాను. – గుర్రం చేతన లాస్య, చాణుక్యపురి కాలనీ, కర్నూలు -
యువత పాత్ర కీలకం
నేను పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం బీటెక్ చేస్తున్నాను. 2023లో ఓటరుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు నా దరఖాస్తును ఆమోదించారు. ఎపిక్ కార్డు కూడా వచ్చింది. మొదటి సారిగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మంచి పాలకులను ఎన్నుకోవడంలో యువత పాత్ర కీలకం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. – వినీల భూపని, కృష్ణానగర్, కర్నూలు -
ఓటు తప్పకుండా వేస్తా
నేను బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాను. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరుగా నమోదు అయ్యేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేశాను. దరఖాస్తును ఆమోదించి ఓటరుగా నమోదు చేశారు. స్మార్ట్ ఎపిక్ కార్డు కూడా వచ్చింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో నాకు ఓటు లభించింది. పోలింగ్ రోజు ఎన్ని పనులున్నా.. ఓటు తప్పకుండా వేస్తాను. స్వేచ్ఛగా, నిర్ఛయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటాను. – పి.లక్ష్మిచేతన రెడ్డి, వీనస్ కాలనీ, కర్నూలు ●
Related News by category
-
ఓటు తప్పకుండా వేస్తా
నేను బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాను. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరుగా నమోదు అయ్యేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేశాను. దరఖాస్తును ఆమోదించి ఓటరుగా నమోదు చేశారు. స్మార్ట్ ఎపిక్ కార్డు కూడా వచ్చింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో నాకు ఓటు లభించింది. పోలింగ్ రోజు ఎన్ని పనులున్నా.. ఓటు తప్పకుండా వేస్తాను. స్వేచ్ఛగా, నిర్ఛయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటాను. – పి.లక్ష్మిచేతన రెడ్డి, వీనస్ కాలనీ, కర్నూలు ● -
మంచి పాలనకే ‘తొలి’ ఓటు!
● నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటాం ● ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగం ● పాలకులు మంచి వారైతే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది ● తొలిసారిగా ఓటు వేయబోతున్న యువత మనోగతం కర్నూలు(అగ్రికల్చర్): మంచి పాలన అందించే వారికే తాము ఓటు వేస్తామని తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువతీ, యువకులు చెబుతున్నారు. పాలకులు మంచి వారైతే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి వారినే తాము ఎన్నుకుంటామని పేర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో 20.14 లక్షలు, నంద్యాల జిల్లాలో 13.94 లక్షలు.. మొత్తం 34.08 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18, 19 ఏళ్ల యువత 1,71,215 మంది ఉన్నారు. అయితే ఇందులో 87,285 మంది ఓటర్లుగా నమోదయ్యారు. మే నెల 13న నిర్వహించే శాసనసభ, లోకసభ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 49,741, నంద్యాల జిల్లాలో 37,844 మంది మొద టి సారిగా ఓటు వేయనున్నారు. ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని వీరు స్పష్టం చేస్తున్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే వారిని, అభివృద్ధి చేసేవారని గెలిపిస్తామని చెబుతున్నారు. ఈ సారి పెరగనున్న ఓటింగ్ శాతం.. 18–19 ఏళ్ల యువత ఓటర్లుగా నమోదయ్యేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ఎన్నికల కమిషన్ పిలుపు నిస్తోంది. ఇందులో భాగంగా స్వీప్ కార్యక్రమాలను అధికారులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. 2019 వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఓటింగ్కు 50 శాతం వరకు యువత దూరంగా ఉంటోంది. ఈ సారి ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా యువఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. నియోజక వర్గం 18–19 ఏళ్ల యువ ఓటర్లు కర్నూలు 6,425 పాణ్యం 8,250 పత్తికొండ 5,678 కోడుమూరు 5,947 ఎమ్మిగనూరు 6,483 మంత్రాలయం 5,429 ఆలూరు 5,749 శ్రీశైలం 8,349 నంద్యాల 6,709 బనగానపల్లె 6,402 ఆదోని 5,510 ఆళ్లగడ్డ 5,247 డోన్ 5,488 నందికొట్కూరు 5,609 మొత్తం 87,275 -
నేడు తర్తూరు రంగనాథుడి రథోత్సవం
జూపాడుబంగ్లా: త ర్తూరు శ్రీ లక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్సవాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీగా తరలిరానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓఏడీ వెంకటరమణ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంతో అలంకరించిన ప్రభోత్సవ రథంపై కొలువుంచారు. అనంతరం గ్రామోత్సవంలో ప్రజలు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
స్నేహితులతో కూడా ఓటు వేయిస్తా
ప్రస్తుతం నేను ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాను. ఓటు హక్కును పొందేందుకు దరఖాస్తు చేసుకోవడంతోనే అమోదించి ఓటరుగా నమోదు చేశారు. ఆలూరు నియోజకవర్గంలో నా ఓటు నేను స్వేచ్ఛగా వినియోగించుకుంటాను. పాలకులు మంచివారైతే రాష్ట్రం బాగుపడుతుంది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటువేస్తాను. మొదటి సారిగా ఓటు వేయబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఓటు వేస్తా... నా స్నేహితులతో కూడా ఓటు వేయిస్తాను. – గుర్రం చేతన లాస్య, చాణుక్యపురి కాలనీ, కర్నూలు -
టీజీ భరత్ జన్మదిన వేడుకకు కోట్లలో ఖర్చు..!
టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తండ్రి, పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేష్కు సంబంధించిన శ్రీరాయలసీమ ఆల్కాలీస్ పరిశ్రమకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి xxxxxx680523 నెంబర్ గల ఖాతాకు మార్చి 8న రూ.1,500 జమ అయ్యింది. టీజీ భరత్ కుటుంబానికి చెందిన గౌరీగోపాల్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి xxx0523నెంబర్ గల ఖాతాకు ఏప్రిల్ 6న రూ.5 వేలు జమ అయ్యింది.. ఈ రెండే కాదు.. ఎన్నికల వేళ కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గుట్టుగా డబ్బు పంపిణీ చేస్తూ కుల సంఘాల నాయకులను, ప్రజలను ప్రలోభపెడుతున్నట్ల తెలుస్తోంది. ఓటమి భయంతో డబ్బును ఎరగా చూపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కులాల వారీగా సంఘాల నాయకులను చేరదీసి కొంతమందికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు ముట్టజెప్పి మద్దతు కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండుసార్లు ఓటమి చెందాం.. సాయం చేయండి.. టీజీ భరత్ తరపున ఆయన తండ్రి టీజీ వెంకటేష్ నగరంలోని ప్రముఖులను పలు రాజకీయ పార్టీల నాయకులు, కులసంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులను పిలిపించి రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు. రెండుసార్లు ఓడిపోయాం.. ఈసారి కూడా ఓడిపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఎలాగైనా సాయం చేయండి.. మీకు ఏ విధమైన సాయం కావాలన్నా చేస్తామంటూ ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. వార్డుల్లో ఒకస్థాయి నాయకుడిని కూడా వదలకుండా తన కార్యాలయానికి పిలిపించుకుని అంతో ఇంతో ముట్టజెప్పి తన కొడుకును గట్టెక్కించాలని ప్రాధేయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో టీజీ వెంకటేష్ దగ్గర కనీసం 70 మందికి పైగా ముఖ్యమైన వ్యక్తులు ఎళ్లవేళలా కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండేవారు. టీజీ భరత్ వ్యవహారశైలి నచ్చక చాలామంది దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా టీజీ వెంకటేష్ పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భరత్తో కలసి పని చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. బర్త్డే గిఫ్ట్ పేరుతో ఓటర్లకు వల 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం. ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించేందుకు భరత్ తన బర్త్డేను వేదికగా చేసుకున్నారు. బర్త్డేకు జనం రారని ముందే ఊహించి తన అనుచరులతో ఇంటింటికీ తిరిగి గిఫ్ట్ కూపన్లు పంపిణీ చేయించారు. ఏస్టీబీసీ కళాశాల మైదానంలో వచ్చి న వారందరికీ విందుతో పాటు రూ.700 విలువ చేసే గిప్ట్లు పంపిణీ చేసి ఎన్నికల్లో సహకరించాలని కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. – కర్నూలు
Advertisement
Photos
View allVideo
View allఅతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement