చిన్నమల్కాపురంలో మహిళ హత్య | Sakshi
Sakshi News home page

చిన్నమల్కాపురంలో మహిళ హత్య

Published Mon, Mar 27 2023 1:42 AM

మృతి చెందిన నాగేశ్వరమ్మ 
 - Sakshi

డోన్‌ రూరల్‌: పొలానికి వెళ్లి తిరిగి వస్తూ చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ హత్యకు గురయ్యారు. డోన్‌ రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌ తెలిపిన వివరాల మేరకు.. భర్త మృతి చెందడంతో నాగేశ్వరమ్మ గ్రామంలో ఒంటరిగా జీవిస్తోంది. పొలం పనులు చేస్తూ ఇద్దరు సంతానాన్ని పోషిస్తోంది. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లిన ఆమె సాయంత్రం గ్రామ సమీపంలో రక్తపుమడుగులో కనిపించింది. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలాన్ని రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌ పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి చంపి ఉంటారని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని, విచారణ జరుపుతున్నామన్నారు.

Advertisement
Advertisement