ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఈఓ కె.ఎస్.రామరావు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా మహామండపం పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఈఓ గురు వారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కనకదుర్గా నగర్ నుంచి మహామండపానికి వరకు చేపట్టిన ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి చేస్తున్న పునాదుల నిర్మాణ పనుల గురించి ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. అనంతరం గోశాల వద్ద నిర్మిస్తున్న అన్నదాన భవనం, ప్రసాదాల పోటు నిర్మాణ పనులపై ఈఈ ఎల్.రమాదేవితో చర్చించారు. అన్నదాన భవనం పునాదుల కోసం జరుగుతున్న రాడ్బెండింగ్ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు తొలుత పునాదుల నిర్మాణం కీలకమని, పనుల పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వేసవి సెలవులు, ఆలయానికి భక్తుల తాకిడి తక్కువగా ఉండే సమయం కావడంతో పనులను మరింత వేగంగా చేపట్టేందుకు వీలు కలుగుతుందని ఆలయ ఈవో ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఈవో వెంట దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మాస్టర్ ప్లాన్ పనులు వేగవంతం చేయాలి
Published Fri, May 10 2024 10:25 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
రాజస్థాన్లో భూకంపం.. భయంతో జనం పరుగులు
కేంద్రంలో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..
ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య
ఇంత దారుణమా..
ఆస్తి కోసమే బాలిక హత్య
కలిసి బతకలేమని కడతేరిపోయారు!
ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ రాజు
ప్రదీప్ రంగనాథన్తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్
Weekly Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు
Advertisement