యోగా పోటీల్లో ఓవరాల్‌ చాంప్‌గా పీబీ సిద్ధార్థ | Sakshi
Sakshi News home page

యోగా పోటీల్లో ఓవరాల్‌ చాంప్‌గా పీబీ సిద్ధార్థ

Published Fri, Nov 24 2023 1:24 AM

ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ సాధించిన సిద్ధార్థ కళాశాల జట్టు   - Sakshi

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణా యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల యోగా పోటీలు సిద్ధార్థ కళాశాల ఆవరణలో గురువారం ఉత్సాహంగా సాగాయి. యూనివర్సిటీ పరిధిలో ఐదు కళాశాలల నుంచి 45 మంది విద్యార్థులు హాజరై యోగాసనాలను ప్రదర్శించారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో పీబీ సిద్ధార్థ కళాశాలకు చెందిన బి.సీతారామాంజనేయులు ప్రథమ, వై.కోటి సాయిదుర్గా గౌరీనాథ్‌ (కేబీఎన్‌ కళాశాల)కు ద్వితీయ, కె.కిరణ్‌ కల్యాణ్‌ (కేబీఎన్‌ కళాశాల) తృతీయ స్థానంలో నిలిచారు. మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రథమ స్థానంలో జి.జ్యోత్సదేవి(పీబీ సిద్ధార్థ), ఎండీ నాజీయం కౌశర్‌(సిద్ధార్థ మహిళా కళాశాల) ద్వితీయ స్థానంలో, పి.శృతి (ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల) తృతీయ స్థానంలో నిలిచారు. ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పీబీ సిద్ధార్థ కళాశాల ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించింది. సాయంత్రం జరిగిన బహమతి ప్రధానోత్సవానికి సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.రమేష్‌ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. బహుమతులు పొందిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్‌ వేమూరి బాబూరావు, డీన్‌ రాజేష్‌ సి.జంపాల, కళాశాల వ్యాయామ విభాగాధిపతి ఎ.చినబాబు అభినందించారు.

Advertisement
Advertisement