భద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామ పంచాయతీ ఆ ధ్వర్యంలో ఆశీలు (పార్కింగ్), సంత, గోదావరి ఫెర్రీ, పంచాయతీ దుకాణాలకు శుక్రవారం వేలంపాట నిర్వహించారు. డీఎల్పీఓ సుధీర్, గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ సమక్షంలో వేలంపాట నిర్వహించగా, ఆశీలును రూ.79 లక్షలకు రాములు అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. గతేడాది ఇదే కాంట్రాక్టర్ రూ.54.90 లక్షలకు వేలం పాట పాడుకున్నాడు. గతేడాది టెండర్లు మార్చితోనే ముగియగా, పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మూడు నెలల గడువు పొడిగించారు. అందుకు టెండర్పై 40 శాతం పెంచి ఆశీలు కు రూ.19.40 లక్షలు, ఫెర్రీ రూ.6.25 లక్షలు, వారపు సంత రూ.35వేలు, మూడు దుకాణాలకు రూ.85వేలు గ్రామ పంచాయతీ అధికారులు వసూలు చేశారు. గోదావరి నదిలో ఉండే బోట్లు(ఫెర్రీ) గతేడాది రూ.18 లక్షల 75 వేలు పలకగా, ఈసారి రూ.16.90 లక్షలు పలికింది. చర్ల రోడ్డులో నిర్వహించే వారపు సంత గతేడాది రూ.1.76 వేలు పలకగా, ఈ ఏడాది రూ.3.90 లక్షలకు దక్కించుకున్నారు. మూడు దుకాణాలు రూ. 3 లక్షలు పలికాయి. ఈ ఏడాది 9నెలలకు టెండర్ నిర్వహించగా రూ.1.2కోట్ల ఆదాయం సమకూరింది.
Comments
Please login to add a commentAdd a comment