బయో డైవర్సిటీ బృందం పర్యటన | - | Sakshi
Sakshi News home page

బయో డైవర్సిటీ బృందం పర్యటన

Published Sat, Jun 22 2024 12:12 AM | Last Updated on Sat, Jun 22 2024 12:12 AM

-

దమ్మపేట/అశ్వారావుపేటరూరల్‌ : భద్రాద్రి జిల్లా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని పలుగ్రామాల్లో బయో డైవర్సిటీ సాంకేతిక బృందం శుక్రవారం పర్యటించింది. జాతీయ బయోడైవర్సిటీ సాంకేతిక కమిటీ చైర్మన్‌ సి.అచలేందర్‌ రెడ్డి, ఐఎఫ్‌ఎస్‌లు కృష్ణమూర్తి, జయరాజ్‌, ఏపీ చైర్మన్‌ జయ్‌రాజ్‌, పెదవేగి సీనియర్‌ శాస్త్రవేత్త ఎంవీ ప్రసాద్‌, భద్రాద్రి జిల్లా ఉద్యాన శాఖాధికారి సూర్యనారాయణ దమ్మపేట, అఖినేపల్లి, నారంవారిగూడెం, అశ్వారావుపేటలోని ఆయిల్‌పామ్‌ తోటలు, అప్పారావుపేటలోని పామాయిల్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. ఆయిల్‌పామ్‌ రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు, ప్రోత్సాహకాలను అధికారుల ద్వారా తెలుసుకున్న వారు రైతులతో మాట్లాడి పెట్టుబడి, దిగుబడిపై ఆరాతీశారు. ఆయిల్‌పాం తోటలను సాగు చేసే గిరిజన రైతులను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఉద్యాన అధికారి సందీప్‌, ఆయిల్‌ఫెడ్‌ డివిజనల్‌ మేనేజర్‌ బాలకృష్ణ, రాజశేఖరరెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ఓ సూర్యనారాయణ, శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.వీ. ప్రసాద్‌, ఫ్యాక్టరీ మేనేజర్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement