జ్యేష్ఠాభిషేకానికి అంకురార్పణ
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం జరగనున్న జ్యేష్టాభిషేకానికి శుక్రవారం అంకురార్పణ చేశారు. పవిత్ర గోదావరి నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు తీర్థబిందె తీసుకొచ్చారు. జ్యేష్ట పౌర్ణమి, ఏరుపాక పౌర్ణమిని పురస్కరించుకుని రామాలయంలో ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు. బేడా మండపంలో 81 కలశాల్లో సమస్త నదీ జలాలను ఆవాహన చేసి స్వామివారికి అభిషేకం చేస్తామని, ఈ సందర్భంగా నిత్యకల్యాణం రద్దు చేశామని పేర్కొన్నారు.
రామయ్యకు స్వర్ణకవచాలంకరణ
శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆతర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నేడు రామయ్యకు అభిషేకం
Comments
Please login to add a commentAdd a comment