ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీ

Published Thu, Mar 28 2024 12:35 AM | Last Updated on Thu, Mar 28 2024 12:35 AM

ఆస్పత్రిని సీజ్‌ చేస్తున్న సిబ్బంది - Sakshi

ఖమ్మంవైద్యవిభాగం: నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.మాలతి ఆధ్వర్యాన బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రుల్లో తనిఖీ చేశారు. వైరారోడ్డులోని ఆదిత్య ఆస్పత్రిలో అబార్షన్లు నిర్వహిస్తున్నట్లు అందిన ఫిర్యాదుతో రెండు రోజుల క్రితం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీ చేశారు. డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించి అబార్షన్లు నిర్వహిస్తుండగా గుర్తించి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ ఆస్పత్రిని డీఎంహెచ్‌ఓ సీజ్‌ చేశారు. అదే కాంప్లెక్స్‌లోని తులసి డెంటల్‌ ఆస్పత్రి, పాజిటివ్‌ హోమియో కేర్‌ ఆస్పత్రులను సైతం సీజ్‌ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా నిబంధనలు తుంగలో తొక్కి నిర్వహిస్తున్నట్లు తేలడంతో ఈ ఆస్పత్రులను సీజ్‌ చేసినట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సైదులు, డెమో కాశీనాథ్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించని

మూడు దవాఖానాల సీజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
రికార్డులు తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌ఓ మాలతి1
1/1

రికార్డులు తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌ఓ మాలతి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement