ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు

Published Sat, Nov 25 2023 1:28 AM

-

యశవంతపుర: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్‌పై బెంగళూరు వయ్యాలికావల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పీయూసీ చదువుతున్న విద్యార్థినికి ఇంటర్నల్‌ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయి.. ఈ నెల 22న ప్రిన్సిపల్‌ సదరు విద్యార్థిని తన గదికి పిలిపించుకుని ఎక్కువ మార్కులు ఇవ్వటం తన చేతిలో ఉందంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన విద్యార్థిని గది నుంచి బయటపడింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రుల వద్ద చెప్పటంతో వారు ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement