ఇద్దరు బాలసదనం బాలికల అదృశ్యం | Sakshi
Sakshi News home page

ఇద్దరు బాలసదనం బాలికల అదృశ్యం

Published Thu, Apr 18 2024 10:20 AM

-

కామారెడ్డి క్రైం:బాలసదనంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. పాఠశాల నుంచి బయటకు వెళ్లిన వారు బాలసదనంకు రాకుండా ఎక్కడికో వెళ్లిపోయారని ఫిర్యాదు రావడంతో పట్టణ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో బుధవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రులు లేని ఇద్దరు బాలికలు కామారెడ్డిలోని బాలసదనంలో ఉంటూ హరిజనవాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. ఎప్పటిలాగే ఈ నెల 13 న పాఠశాలకు వెళ్లిన వారిద్దరూ కొద్దిసేపటి తర్వాత ఎవరికీ చెప్పకుండానే బయటకు వెళ్లిపోయారు. చాలా చోట్ల గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో బాలసదనం ఇన్‌చార్జి గంగుబాయి బుధవారం పోలీసు లకు ఫిర్యాదు చేసింది. వీరిలో ఓ అమ్మాయి గతంలో రెండు సార్లు ఇదే విధంగా వెళ్లిపోగా వెతికి తీసుకువచ్చినట్లు బాలసదనం సిబ్బంది చెబుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement