● కేంద్ర మంత్రి అర్జున్ ముండా
● బీజేపీని గెలిపించాలని పిలుపు
బాన్సువాడ: తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా పేర్కొన్నారు. శుక్రవారం బాన్సువాడలో ఆయన వి లేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తే నిధులు, నీళ్లు, నియామకాలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించిందని, వారికి నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. పేపర్ లీకేజీతో నిరుద్యోగ యువత భవిష్యత్ నాశనమైందన్నారు. కేంద్ర ప్రభు త్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా పేర్లు మార్చి స్వార్థ రాజకీయాలకు కేసీఆర్ తెరలేపారన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజురైన ఇళ్లను చూపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పేదల సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తోందన్నారు. రా ష్ట్రంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి ప్రకటించారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని పేర్కొన్నారు. బాన్సువాడ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దొరబాబు, సుగుణ, శ్రీనివాస్, అర్షపల్లి సాయిరెడ్డి, రవీందర్రెడ్డి, మోహన్రెడ్డి, చిదరి సాయిలు, భూపాల్రెడ్డి, శంకర్గౌడ్, కోనాల గంగారెడ్డి, గంగాధర్, కొండని గంగారాం తదితరులు పాల్గొన్నారు.