Sakshi News home page

జోరుగా నామినేషన్లు

Published Sat, Nov 11 2023 2:02 AM

- - Sakshi

135 మంది అభ్యర్థులు..

215 సెట్లు దాఖలు

ముగిసిన నామినేషన్ల పర్వం

కామారెడ్డి క్రైం/మద్నూర్‌: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. శుక్రవారం ఒక్కరోజే 112 నామినేషన్లు వచ్చా యి. అత్యధికంగా కామారెడ్డిలో 45 నామినేషన్లు దాఖలు కాగా.. ఎల్లారెడ్డిలో 27, జుక్కల్‌లో 23, బాన్సువాడలో 17 నామినేషన్లు వేశారు.

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 135 మంది అభ్యర్థులు 215 సెట్ల నామినేషన్లు సమర్పించారు. కామారెడ్డి నియోజకవర్గంలో 74 మంది అభ్యర్థులు కలిపి 103 సెట్ల నామినేషన్లు వేయగా.. ఎల్లారెడ్డిలో 16 మంది 27 సెట్లు, జుక్కల్‌లో 28 మంది 50 సెట్లు, బాన్సువాడలో 17 మంది 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 13న నామినేషన్లను పరిశీలించనున్నారు. 15వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు.

Advertisement
Advertisement