పాలిసెట్‌ ప్రశాంతం | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ ప్రశాంతం

Published Sat, May 25 2024 3:55 PM

పాలిస

జనగామ రూరల్‌/స్టేషన్‌ఘన్‌పూర్‌: జిల్లాలో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష(పాలిసెట్‌–24) శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. జనగామ పట్టణంలో నాలుగు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో రెండు మొత్తం ఆరు సెంటర్లు కేటాయించగా.. 1,543 మంది విద్యార్థులకు 1,443 మంది(92.02 శాతం) పరీక్ష రాసినట్లు జిల్లా కోఆర్డినేటర్‌ ఎ.నర్సయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్రీస్తుజ్యోతి సెంటర్‌కు నలుగురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే సిబ్బంది గేట్లు మూసివేయడంతో వెనుదిరిగారు. కనీసం సెంటర్‌లోకి అనుమతి కోసం అడుగుదామన్నా ఒక్క అధికారి అందుబాటులో లేరని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఈ సెంటర్‌ను కోఆర్డినేటర్‌ నర్సయ్య సందర్శించారు. ఇదిలా ఉండగా.. ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సెంటర్‌లో 360 మందికి 338, పాలిటెక్నిక్‌ కళాశాల సెంటర్‌లో 60 మందికి 55 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ పోచయ్య తెలిపారు. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. విద్యార్థులు 10 గంటల వరకే సెంటర్లకు చేరుకున్నారు.

92.02 శాతం మంది హాజరు

ఆలస్యంగా వచ్చిన నలుగురు విద్యార్థులు

గేట్లు మూసి ఉండడంతో

నిరాశతో తిరుగు పయనం

పాలిసెట్‌ ప్రశాంతం
1/1

పాలిసెట్‌ ప్రశాంతం

Advertisement
 
Advertisement
 
Advertisement