Sakshi News home page

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

Published Mon, Apr 15 2024 1:45 AM

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆర్డీఓ   - Sakshi

జఫర్‌గఢ్‌: మండలంలోని తిమ్మంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీఓ వెంకన్న ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వలు, కొనుగోలుతో పాటు వసతులను ఆర్డీఓ వెంకన్న అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదన్నారు. రైతుల వద్ద నుంచి కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. ప్రస్తతం ఎండలు మండుతుండడంతో రైతులు వడదెబ్బ బారిన పడకుండా తగిన వసతులు కల్పించాలన్నారు. గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండాలన్నారు. తూకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ అంజనేయులు, ఆర్‌ఐ అనిల్‌బాబు, ఐకేపి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement