కొండగట్టుకు చేరిన చేనేత కార్మికులు | Sakshi
Sakshi News home page

కొండగట్టుకు చేరిన చేనేత కార్మికులు

Published Sun, May 26 2024 3:05 AM

కొండగట్టుకు చేరిన   చేనేత కార్మికులు

స్వామివారికి పట్టువస్త్రాల తయారీ

కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి సన్నిధిలో ఈనెల 30 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాల జరుగనున్న విషయం తెల్సిందే. స్వామివారికి పట్టువస్త్రాలు తయారు చేసేందుకు సికింద్రాబాద్‌ పద్మశాలీ చేనేత కార్మికులు శనివారం కొండగట్టుకు చేరుకున్నారు. గుట్టపై ఆలయ పరిసరాల్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం మగ్గం పనులను ప్రారంభించారు. ముందుగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి మగ్గంపైనే పట్టువస్త్రాలు తయారు చేస్తామని కార్మికులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement