నాడు సిరులు.. నేడు కరువు | Sakshi
Sakshi News home page

నాడు సిరులు.. నేడు కరువు

Published Mon, Apr 8 2024 1:20 AM

- - Sakshi

సుమారు ఐదువేల ఎకరాలకు సాగునీరందించే వెల్గటూర్‌ మండలం జగదేవ్‌పేటలోని జంగల్‌నాలా చెరువు.. ప్రస్తుతం నీరు లేక కళ తప్పింది. ఒకప్పుడు సిరులు పండించిన ఈ చెరువు నేడు కరువు కారణంగా వెలవెలబోతోంది. చెరువుపై ఆధారపడి నాలుగు గ్రామాల (జగదేవ్‌పేట, కొండపూర్‌, శాఖాపూర్‌, కప్పారావుపేట) రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క జగదేవుపేటలోనే రెండు వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఏటా యాసంగిలో రంగధామునిపల్లి చెరువు నింపిన తర్వాత మత్తడి ద్వారా వచ్చే నీటితో జంగల్‌నాలా చెరువు నిండుతుంది. ఈ పరిస్థితి పోయి జంగల్‌నాలా చెరువుకు శాశ్వతంగా సాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని నాలుగు గ్రామాల రైతులు కోరుతున్నారు. – వెల్గటూర్‌

Advertisement
Advertisement