కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలో కీలకమైన టీచింగ్, నాన్టీచింగ్ విభాగాల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా విధులను నిర్వర్తిస్తున్న పెండ్లి అశోక్బాబునును బదిలీ చేస్తూ శనివారం రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. అశోక్బాబుకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్సైన్స్కళాశాల అసిస్టెంట్ రిజిస్ట్రార్గా బదిలీ అయ్యింది.కేయూ వీసీగా తాటికొండ రమేశ్ హయాంలో అశోక్బాబు కీలకంగా వ్యవహరించడం, దీంతోపాటు యూనివర్సిటీ భూమిలో ఇల్లు ఉండటంతో భూ కబ్జాకు పాల్పడ్డాడనేది అకుట్ బాధ్యులతోపాటు వివిధ విద్యార్థి సంఘాలు కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రమేశ్ పదవీకాలం ముగియడంంతో అకుట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మామిడాల ఇస్తారి, ఇతర బాధ్యులు కూడా ఈ నెల 24న రిజిస్ట్రార్తో వాగ్వాదానికి దిగారు. అశోక్బాబును సస్పెండ్ చేయాలని లేదా ఆసెక్షన్ నుంచి వేరే చోటుకు పంపాలని డిమాండ్ చేశారు. దీంతో శనివారం మల్లారెడ్డి హైదరాబాద్కు వెళ్లారు. ఇన్చార్జ్ వీసీ వాకాటి కరుణను కలిశారు. వీసీ అప్రూవల్ మేరకు అశోక్బాబును ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాలకు బదిలీ చేశారు.పరీక్షల విభాగానికి ఏఆర్ సరళాదేవి
ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాలలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న జి సరళాదేవిని కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగం ఏఆర్గా బదిలీ చేశారు
కేయూ నుంచి ఆర్ట్స్ కాలేజీకి
రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ